సైదాపూర్ రూరల్: స్కూల్ అంటే భయపడి ఓ విద్యార్థిని ఉసురు తీసుకుంది. తక్కువ మార్కులొచ్చినందుకు టీచర్ కొడతారనే భయాందోళనతో ఆత్మహత్య చేసుకుంది. ఉపాధ్యాయుడి తీరు నచ్చక తీవ్ర ఒత్తిడితో, అంతులేని ఆవేదనతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. సోమవారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరుకపల్లిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ‘ఆ స్కూల్ అంటే నాకు ఇష్టం లేదు. మాకు చదువు చెప్పిన సాదిక్ సార్ను విడిచిపెట్టొద్దు. ఇది నా ఆఖరి కోరిక’ అని సూసైడ్ నోట్ రాసి కోడం శ్రావణి(14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి ఇదే మండలంలోని సోమారం మోడల్ స్కూల్లో చదువుతోంది. విరేచనాలు అవుతున్నాయని సోమవారం బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న ఆమె.. కుటుంబ సభ్యులందరూ బయటకు వెళ్లాక మధ్యాహ్నం సూసైడ్ నోట్ రాసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించుకుంది. తల్లిదండ్రులు ఇంటికొచ్చి చూసే సరికి పూర్తిగా కాలిపోయి మరణించి ఉంది. ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలియా ల్సి ఉంది. సంఘటన స్థలంలో శ్రావణి సూసైడ్ నోట్ లభించింది.
సూసైడ్ నోట్లోని వివరాలివీ..
‘నేను చనిపోవాలనుకుంటున్నా. ఎం దుకంటే నాకు తక్కువ మార్కులు వచ్చాయి. ఆ స్కూల్ అంటే నాకు నచ్చడం లేదు. అక్కడ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రాజెక్టులు చేయమంటరు. కానీ వాటిల్లో మమ్మల్ని దగ్గరకు రానీయకుండా వేధిస్తున్నారు. నా ఆఖరి కోరిక సాదిక్ సార్ను ఇరుగపరుగ కొట్టాలి. అసలు నేను నిన్ననే చనిపోతానని అనుకున్నా. కానీ, అందరూ ఇంటికాడనే ఉన్నరు. ఇవ్వాళ ఎట్ల చేసైనా నేను స్కూల్కు పోవద్దని, విరేచనాలు అయితున్నయని అబద్ధం చెప్పిన. నన్ను క్షమించు అమ్మా. నేను చనిపోతే బాధపడకు. నువ్వన్నా, నాన్నన్నా నాకు మస్తు ఇష్టం. ఎలా చనిపోదామనుకున్నా దొరుకుత. అందుకే కిరోసిన్ పోసుకుని చద్దామనుకుంటున్న. అన్నయ్యా.. నువ్వు మంచి గ్రేడ్ తెచ్చుకోవాలే’
- ఇట్లు కె.శ్రావణి
9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
Published Tue, Nov 3 2015 3:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement