దక్షిణ గాలులతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. కొన్నాళ్లుగా వీస్తున్న తూర్పు, ఈశాన్య గాలులు క్రమంగా దిశ మార్చుకుంటున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ, దక్షిణం నుంచి ఇవి వీయడం మొదలెట్టాయి. ఉత్తరాది నుంచి వస్తున్న శీతల గాలులను ఇవి అడ్డుకుంటున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల్లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చలి ప్రభావం తగ్గడానికి ఈ మార్పులు కారణమవుతున్నాయి. ప్రస్తుతం వెస్టర్న్ డిస్టర్బెన్స్ (పశ్చిమ ఆటంకాలు) పశ్చిమం నుంచి తూర్పు వైపు పయనిస్తుండటమే దక్షిణ గాలులకు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
వీటి వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి, చలి తగ్గినా పొగ మంచు అధికమవుతుందని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి ’కి చెప్పారు. పొగ మంచు ఉత్తరకోస్తా, ఉత్తర తెలంగాణల్లో అధికంగా కనిపిస్తుందన్నారు. కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. చలి కాస్త తగ్గినా పొగమంచు వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందన్నారు. అందువల్ల జనం మంచులో తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణలో సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4, గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీలు, ఆంధ్రప్రదేశ్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగాను, గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం ఒకట్రెండు డిగ్రీలు తక్కువగాను నమోదవుతున్నాయి. ఈ నెల 23న తెలంగాణలోని ఆదిలాబాద్లో 4.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా మంగళవారం 15 డిగ్రీలు నమోదు కావడం మారిన పరిస్థితిని తెలియజేస్తోంది. గత 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా ఉంది.
చలి తగ్గుముఖం.. మంచు ఉధృతం
Published Wed, Jan 27 2016 2:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement