ఏసీబీ వలలో ద్రాక్షారామ ఎస్సై | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ద్రాక్షారామ ఎస్సై

Published Thu, Feb 23 2017 12:02 AM

ఏసీబీ వలలో ద్రాక్షారామ ఎస్సై - Sakshi

ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్‌): ఈవ్‌ టీజింగ్‌ కేసులో రూ.5వేలు లంచం తీసుకుంటూ రామచంద్రపురం మండలం ద్రాక్షారామ ఎస్సై ఫజల్‌ రహ్మన్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మండలంలోని కాపవరం గ్రామానికి చెందిన యనమదల భారతి తెలిపిన వివరాల మేరకు తన కుమార్తెను అదే గ్రామానికి చెందిన సత్యవాడ రాజ అనే యువకుడు వేధిస్తున్నాడని, ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో గత నెల 23న రాజ తల్లికి విషయాన్ని వివరించేందుకు భారతీ వెళ్లగా అతని కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేసి గాయపరిచారు. దీంతో భారతి రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి వెళ్లగా అక్కడ మెడికో లీగల్‌ కేసు నమోదు చేశారు. అయినప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో ఎస్సై ఫజల్‌ రెహమన్‌కు భారతి ఆమె సమస్య వివరించారు. ఈ కేసు పరిష్కారానికి రూ.5వేలు లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ రాజమండ్రి డీఎస్పీ ఎం.సుధాకరరావు  సీఐ పీవీ సూర్యమోహనరావు, ఎస్సై టి.నరేష్‌ వలపన్ని బుధవారం స్టేషన్‌లో ఉన్న ఎస్సైకి ఏసీబీ అధికారులు సూచనల మేరకు భారతి రూ 5వేలు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement