తప్పిన ముప్పు | Sakshi
Sakshi News home page

తప్పిన ముప్పు

Published Wed, May 4 2016 1:50 AM

తప్పిన ముప్పు - Sakshi

తీవ్రంగా గాయపడిన తల్లి, కొడుకులు
నర్సాపూర్ వంతెన వద్ద ఘటన

తూప్రాన్: అతి వేగంగా వచ్చిన లారీ.. ఓ బైక్‌ని ఢీకొట్టడంతో తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తూప్రాన్-నర్సాపూర్ రహదారిపై నర్సాపూర్ వంతెన వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శివ్వంపేట మండలం చండీ గ్రామానికి చెందిన సింగంశెట్టి సుధాకర్, తల్లి ప్రమీలతో కలిసి బైక్‌పై తూప్రాన్‌లో జరుగుతున్న సంతకు వెళ్తున్నారు. నర్సాపూర్ వంతెన వద్దకు రాగానే నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ బైక్‌తో సహా లారీ కిందకు వెళ్లిపోయారు. సుధాకర్ కాళ్లు నుజ్జునుజ్జు కాగా, ప్రమీల  ఎడమ కాలుకు తీవ్రగాయమైంది. బాధితులు కొంపల్లిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, పోలీసులకు ఇంకా ఫిర్యాదు అందలేని తెలిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement