– ప్రమాదాల నియంత్రణకు పరిజ్ఞానం పెంచుకోవాలి
– రోడ్డు భధ్రతా వారోత్సవాల్లో వక్తలు
అనంతపురం సిటీ : రోడ్డు ప్రమాదాలు కేవలం మానవ తప్పిదాలతోనే అధికంగా జరుగుతున్నాయని వక్తలు అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్లో ‘రహదారులు–భవనాలశాఖ’ ఆధ్వర్యంలో ‘రోడ్డు భధ్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్అండ్బీ ఎస్ఈ సుబ్రమణ్యం అధ్యక్షత వహించగా, ముఖ్య అథితులుగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, జేఎన్టీయూ మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ హేమచంద్ర, పలువురు ఇంజినీర్లు హాజరయ్యారు. ఈసందర్భంగా జేసీ లక్ష్మీకాంతం, జేఎన్టీయూ ఫ్రొఫెసర్ హేమచంద్ర తదితరులు మాట్లాడుతూ దేశం ఇప్పుడిప్పుడే పురోగతి సాధిస్తోందన్నారు. ఇక్కడున్న రోడ్లు, ఫుట్పాత్లతోపాటు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ప్రయాణాలు సాగించాలన్నారు.
వేగం ఎంత ప్రమాదమో తెలుసుకోవాలన్నారు. వంద ప్రమాదాలు జరిగితే వాటిలో 98 ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయన్నారు. కేవలం మానవ తప్పిదాల కారణంగా చాలా మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ఈ తప్పిదాలను నియంత్రించాలంటే ప్రత్యేక చట్టాలు, హెచ్చరికలు, సూచనలు ఎన్ని ఉన్నా...ప్రతి మనిషిలో ప్రమాదాల నియంత్రణ పట్ల పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే చాలన్నారు. గమ్యాన్ని చేరాలంటే వేగం ఒక్కటే సరిపోదన్నారు. అనంతరం రోడ్లు భవణాల శాఖలో ప్రమాదాల నియంత్రణపై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉద్యోగులకు అధికారులు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి ముందుగా ఆర్అండ్బీ కార్యాలయం నుంచి స్థానిక సఫ్తగిరి సర్కిల్ దాకా ఇంజనీరింగ్ విద్యార్థినీ, విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆ శాఖ అధికారులు, కళా బృందం సభ్యులు పాల్గొన్నారు. కళా బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతాలో పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు
Published Tue, Jan 24 2017 10:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement