కరవుపై యాక్షన్‌ప్లాన్ ప్రకటించాలి | Sakshi
Sakshi News home page

కరవుపై యాక్షన్‌ప్లాన్ ప్రకటించాలి

Published Sat, Aug 8 2015 1:58 PM

Action plan for drought, demands congress party leader SA Appala naidu

విజయనగరం : రాష్ట్రంలోని నెలకొన్న కరవుపై వెంటనే కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నేత సమ్మంగి చిన అప్పల నాయుడు డిమాండ్ చేశారు. ఆయన శనివారం బొబ్బిలిలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తోటపల్లి కాల్వ పనులు ప్రారంభించినప్పటికీ పొలాలకు నీరు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ఆర్భాట ప్రచారమే తప్ప సాగు నీరు విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు.

Advertisement
Advertisement