ముద్రగడను కలిసిన మంచు విష్ణు | Sakshi
Sakshi News home page

ముద్రగడను కలిసిన మంచు విష్ణు

Published Wed, Feb 17 2016 8:30 PM

ముద్రగడను కలిసిన మంచు విష్ణు - Sakshi

కాకినాడ : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను సినీ హీరో మంచు విష్ణు బుధవారం కలిశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని  ఓ వివాహానికి హాజరైన సందర్భంగా ముద్రగడతో సుమారు పది నిమిషాల పాటు మంచు విష్ణు మాట్లాడారు. మండపేటకు చెందిన మోహన్ బాబు అభిమాని కుమారుడి పెళ్లికి ..తండ్రి తరఫున విష్ణు హాజరయ్యారు. ఈ వివాహం ముద్రగడకు చెందిన కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా పెళ్లికి విచ్చేసిన ముద్రగడతో విష్ణును కొద్దిసేపు ముచ్చటించారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.

 

భేటీ అనంతరం మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం తన తండ్రికి సన్నిహితుడని, ఈ నేపథ్యంలోనే ఆయన్ని కలిసినట్లు చెప్పారు.  అంతే తప్ప తమ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని విష్ణు స్పష్టం చేశారు. కాగా కాపులను బీసీల్లోకి చేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం దంపతులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement