ముగిసిన నామినేషన్ల స్వీకరణ | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్ల స్వీకరణ

Published Tue, Feb 21 2017 1:03 AM

ముగిసిన నామినేషన్ల స్వీకరణ

అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం ముగిసింది.  చివరి రోజున పట్టభద్ర నియోజకవర్గానికి 14 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గానికి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ కోన శశిధర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన ఈ నెల 13వ తేదీ నుంచి చివరి రోజు వరకు మొత్తం 51 దాఖలయ్యాయి. ఇందులో పట్టభద్ర నియోజకవర్గానికి 37 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 14 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. చివరిరోజు పట్టభద్ర అభ్యర్థులుగా వెన్నపూస రవీంద్రారెడ్డి, కేతిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జీపీ ఓబులేసు, జీసీ రామలింగారెడ్డి, కోటిరెడ్డి మణిరెడ్డి, కె.కనకరాజు, ఎస్‌.అమృతకుమార్, కొండజోగుల భీమన్న, తగ్గుపర్తి రామన్న, బండమీదపల్లి నబీ రసూల్, వి.శేషాచలమయ్య, సోమశేఖర్‌యాదవ్, జి.వెంకటేశ్వర్లు, జె.శ్రీనివాసులు నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులుగా వీరబ్రహ్మం, నారాయణరెడ్డి, కత్తి నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే మొత్తం 23 మంది అభ్యర్థులు అదనపు సెట్లను దాఖలు చేశారు. కొందరు రెండు, మరికొందరు మూడు, ఇంకొందరు నాలుగు సెట్లు వేశారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement