– రాయితీతో రైతులకు సరికొత్త పథకాలు అమలు
– ఉద్యానశాఖ డీడీ సుబ్బరాయుడు, ఏడీ సత్యనారాయణ
అనంతపురం అగ్రికల్చర్ : ఉద్యానతోటల సాగులో మరింత మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక యాజమాన్య పద్ధతులు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీఎస్ సుబ్బరాయుడు, ఏడీ సీహెచ్ సత్యనారాయణ, ఇంజనీరు శృతి తెలిపారు. కొత్తగా అమలులోకి తెస్తున్న రాయితీ పథకాలను రైతులు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పథకాలు వినియోగించుకోవాలి : రైతులు పండించిన పంట ఉత్పత్తులకు సరైన ధర లేని సమయంలో నిల్వ చేసుకునేందుకు, పంట నాణ్యత పెంచడం, ప్రాసెసింగ్ చేయడానికి, కోత అనంతరం జాగ్రత్తలు, బ్రైప్రొడక్ట్స్గా మార్చుకునేందుకు ఉద్యాన రైతులను ప్రోత్సహిస్తాం. ఇప్పటివరకు పంటల విస్తీర్ణం పెంపుపై దృష్టి సారించాం. ఈ క్రమంలో రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (ఎఫ్పీఓ) ఏర్పాటు చేశాం. వారి చెంతకు మరింత సాంకేతిక పరిజ్ఞానం అందించి ఊతమివ్వడానికి కొత్త పథకాలు అమలు చేస్తున్నాం. ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి రాయితీ పథకాలు వినియోగించుకోవాలి.
కొత్తగా అమలు చేస్తున్న పథకాలు
+ తక్కువఖర్చుతో 25 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఉల్లి నిల్వ కేంద్రం నిర్మాణానికి మొత్తం రూ.1.75 లక్షలు ఖర్చు అవుతుండగా అందులో ప్రభుత్వం రూ.87,500 రాయితీ వర్తిస్తుంది. మిగతాది లబ్ధిదారులు భరించాలి.
+ జీరో ఎనర్జీ కోల్డ్ ఛాంబర్కు రూ.4 వేలు అవుతుండగా అందులో రూ.2 వేలు రాయితీ వర్తిస్తుంది.
+ కోల్ట్స్టోరేజీ నిర్మాణానికి సంబంధించి ఒక మెట్రిక్ టన్ను సామర్థ్యానికి పూర్తీ విలువ రూ.8 వేలు చొప్పున గరిష్టంగా 5 వేల మెట్రిక్ టన్నుల నిర్మాణం చేసుకోవచ్చు. దీనికి 35 శాతం రాయితీ వర్తింపు. గరిష్టంగా రూ.1.40 కోట్లు వరకు రాయితీ వర్తిస్తుంది.
+ రూ.50 లక్షలు విలువ చేసే ఇంటిగ్రేటెడ్ ప్యాక్హౌస్కు రూ.17.50 లక్షలు రాయితీ వర్తింపు.
+ రూ.25 లక్షలు విలువ చేసే ఫ్రీకూలింగ్ యూనిట్కు రూ.8.75 లక్షలు రాయితీ వర్తింపు.
+ రూ.15 లక్షలు విలువ చేసే కోల్ట్రూం నిర్మాణానికి రూ.5.25 లక్షలు రాయితీ వర్తిస్తుంది.
+ రూ.25 లక్షలు విలువ చేసే రిఫ్రిజిరేటెడ్ ట్రాన్స్పోర్టు వెహికల్పై రూ.10 లక్షలు రాయితీ వర్తిస్తుంది.
+ టమాట కిచెచ్ ప్లాంట్, గార్లిక్, ఆనియన్ డీహైడ్రేషన్ ప్లాంట్, రెడ్చిల్లీడ్రైయర్, బొప్పాయి ఫ్రూట్ ప్రాసెసింగ్ ప్లాంట్, ఫైనాఫిల్ జ్యూస్ ప్లాంట్ తదితర ప్రైమరీ, మొబైల్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి రూ.25 లక్షల విలువ చేసే యూనిట్పై రూ.10 లక్షలు రాయితీ వర్తిస్తుంది.
+ రూ.ఒక లక్ష విలువ చేసే రైపనింగ్ ఛాంబర్కు 35 శాతం రాయితీ వర్తింపు.
+ మరిన్ని వివరాలకు డీడీహెచ్–79950 86792, ఏడీహెచ్–79950 86790, ఇంజనీరు–79950 87056 నెంబర్లలో సంప్రదించాలి.
ఉద్యానసాగుకు ఊతం
Published Wed, Jan 25 2017 11:01 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement