– ‘మహానంది’ ప్రధాన శాస్త్రవేత్త సుబ్రమణ్యం
అనంతపురం అగ్రికల్చర్ : పిందె, కాయలు రాలిపోకుండా మామిడి తోటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని కర్నూలు జిల్లా మహానంది ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె.సుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపాల్ ఎస్.చంద్రశేఖరగుప్త ఆధ్వర్యంలో మామిడి సాగుపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సేంద్రియ విభాగపు శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబుతో కలిసి కె.సుబ్రమణ్యం రైతులకు అవగాహన కల్పించారు.
పిందెరాలకుండా జాగ్రత్తలు :
జిల్లా వ్యాప్తంగా 40 వేల హెక్టార్లకు పైగా మామిడి తోటలు సాగవుతుండగా అందులో 28 నుంచి 30 వేల హెక్టార్ల తోటలు కాతకు వచ్చాయి. కొన్ని కాయ, మరికొన్ని పిందె, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా పూత దశలో ఉన్నాయి. వాతావరణ పరిస్థితులకనుగుణంగా పూత, దిగుబడులు వస్తాయి. ద్విలింగ పుష్పాలు వస్తేనే మంచి దిగుబడులు వస్తాయి. చాలా తోటల్లో పిందె, కాయలు రాలుతున్నట్లు సమాచారం. వీటి నివారణకు 1 మి.లీ ప్లానోఫిక్స్ 4.5 లీటర్ల నీటికి లేదంటే 1 గ్రాము 2–4–డీ 100 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
తేనె మంచు, బూడిద తెగులు నివారణ :
ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడి తోటలకు తేనె మంచు, బూడిద తెగులు ఆశించింది. పురుగులు రసం పీల్చడం వల్ల పూత రాలిపోవడం, దిగుబడులు తగ్గిపోతాయి. చెట్ల మొదళ్లు, కాండానికి ఉన్న బెరడు వద్ద పురుగులు దాగి ఉంటాయి. మందులు పిచికారీ చేసే సమయంలో మొదళ్లు, కాండం బాగా తడిచేలా పిచికారీ చేస్తే పురుగులు నశిస్తాయి. బూడిద తెగులు, తేనె మంచు పురుగుల బెడద బాగా తగ్గాలంటే జూలై – ఆగస్టు నెలల్లో 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
అనంతరం నెల రోజుల తర్వాత మరోసారి 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రస్తుత పూత, పిందె సమయంలో ఈ తెగుళ్ల నివారణకు ఘాటైన మందులు వాడకూడదు. ఈగల ద్వారా ఫలదీకరణ జరుగుతుంది. ఈ తెగుళ్ల నివారణకు ప్రస్తుతం 0.5 మి.లీ కాన్ఫిడార్ + 1 గ్రాము బావిస్టన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సిఫారసు చేసిన మోతాదుల్లో ఎరువులు వేసుకోవాలి. అలాగే 3 గ్రాములు ఫార్ములా–4 లీటర్ నీటికి కలిపి సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేసుకుంటే కాయ నాణ్యత, రంగు, పరిమాణాం బాగా వస్తుంది.
సమగ్ర యాజమాన్య పద్ధతులతో దిగుబడి
Published Tue, Mar 7 2017 10:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement