- వర్షం పడిన ప్రాంతాల్లో దుక్కులు చేసుకోవాలి
- కళ్యాణదుర్గం కేవీకే కోఆర్డినేటర్ ఎం.జాన్సుధీర్
అనంతపురం అగ్రికల్చర్ : వర్షం కురిసిన ప్రాంతాల్లో పొలాలను బాగా దుక్కులు చేసుకుంటే వేసే పంటలను రక్షించుకునేందుకు అవకాశం ఉంటుందని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్సుధీర్ తెలిపారు. పశుసంపద తగ్గిపోవడం, ఆర్థిక పరిస్థితులు, వరుస పంట నష్టాలు... తదితర కారణాలతో ఇటీవల కాలంలో చాలా మంది రైతులు దుక్కులు చేసుకోవడం మానేశారన్నారు. వర్షం రాగానే నేరుగా విత్తనం వేసే పరిస్థితి ఉండటంతో త్వరగా బెట్టకు గురై పంట దిగుబడి తగ్గిపోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతోందన్నారు.
వేసవి దుక్కులు :
చీడపీడలు, తెగుళ్ల నివారణకు పంటల్లో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, రసాయన పద్ధతులు, ఇతరత్రా సంక్లిష్ట పద్ధతులు పాటించడం కన్నా భౌతిక, యాంత్రిక పద్ధతులతో సాగు విధానమే ప్రధానం. ఖరీఫ్ పంట కోత లేదా రబీ పంట తర్వాత నెలల తరబడి భూమిని దున్నకుండా వదిలేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నేరుగా పంట విత్తుకోవడం మంచిది కాదు. వేసవిలో అడపాదడపా కురిసే వర్షాలను వినియోగించుకొని మెట్ట, బీడు భూములను దున్నుకోవడమే వేసవి దుక్కులుగా పిలుస్తారు. రకరకాల పరికరాలతో లోతుగా దుక్కులు చేసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పొలాల్లో మట్టి కొట్టుకుపోకుండా, నేల కోతకు గురికాకుండా వాలు ప్రాంతానికి అడ్డంగా దున్నాలి. దీని వల్ల భూమికి నీరు, తేమను నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇది వేసే పంటలకు ఉపయోగంగా మారుతుంది. త్వరితగతిన పంటలు బెట్టకు గురికాకుండా కాపాడుకోవచ్చు.
ఇలా దున్నుకోవాలి :
సాధారణంగా రోటావేటర్ లేదా కల్టివేటర్ ద్వారా దున్నితే 8 నుంచి 12 సెంటీమీటర్లు లోతు మాత్రమే దున్నొచ్చు. సేద్యానికి వాడే గొర్రు, గుంటక, దంతెలు వంటి పరికరాలు 8 నుంచి 12 సెంటీ మీటర్ల వరకు చొచ్చుకుపోతాయి. వీటి ద్వారా పదే పదే సేద్యం చేస్తే లోపల ఉన్న గట్టిపొర (మొరము) ఏర్పడి నీటిని నిల్వ చేసుకునే శక్తి తగ్గిపోతుంది. అదే రెక్కనాగలి, పళ్లెపు నాగలి ఉపయోగిస్తే 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతు వరకు దున్నవచ్చు. దీని వల్ల నేల బాగా గుల్లబారిపోతుంది. లేదంటే గుణపం నాగలితో ప్రతి మూడు అడుగులు లేదా ఒక మీటర్ల ఎడంలో దున్నినపుడు గట్టిపొరను చేధించవచ్చు.
దీని వల్ల తేమశాతం పెంచుకోవచ్చు. పంటలు లేని సమయంలో చీడపీడలు, తెగుళ్ల వ్యాప్తి కారణమయ్యే పురుగులు, శిలీంధ్రాలు భూమిలో నిద్రావస్థలో ఉంటాయి. ఎండాకాలంలో దున్నడం వల్ల నిద్రావస్థలో ఉన్న పురుగులు బయటకు వచ్చి నశిస్తాయి. మే నెలల్లో చేయడం వల్ల పురుగులు, శిలీంద్రాలు ఎండవేడికి చనిపోవడం వల్ల తొలిదశలో పంటకు ఎలాంటి చీడపీడలు, తెగుళ్లు సోకే అవకాశం చాలా తక్కువ. చాలా రోజుల పాటు భూమిని ఖాళీగా వదిలేయడం వల్ల మొండిజాతి కలుపు మొక్కలుపెరిగి భూమిలో ఉన్న నీటిని, పోషకాలను తీసుకొని నిస్సారం చేస్తాయి. వేసవి దుక్కుల వల్ల ఇలాంటి కలుపు మొక్కలను నివారించుకోవడంతో పాటు గత పంట అవశేషాలు భూమిలో కలిసి భూసార పెరగడానికి దోహదం చేస్తుంది. దీని వల్ల సేంద్రియ కర్బనం శాతం పెరుగుతుంది.
లోతు దుక్కులతో లాభసాటి దిగుబడి
Published Mon, May 22 2017 12:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ
వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్ ముద్రించాలని నిర్ణయం
ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన
నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్పై స్పందించిన నటి
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయుల అరెస్ట్
Advertisement