Sakshi News home page

కానిస్టేబుల్ పరీక్షకు సర్వత్రా సిద్ధం: నల్గొండ ఎస్పీ

Published Sun, Apr 24 2016 9:57 AM

all preparation ok for constable exam

నల్గొండ : జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్ పరీక్షకు సర్వత్రా సిద్ధమని ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ ఆదివారం నల్గొండలో వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 160 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 58510 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారని తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అభ్యర్థులకు జిల్లా ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ సూచించారు.

Advertisement
Advertisement