పాదగయకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి | Sakshi
Sakshi News home page

పాదగయకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి

Published Fri, Jun 3 2016 9:37 AM

Allahabad High court justice Narayana Shukla vists Padagaya and Annavaram shrines

పిఠాపురం: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి నారాయణ శుక్లా కుటుంబ సభ్యులతో కలసి గురువారం పాదగయ క్షేత్రాన్ని దర్శించారు. ఆలయ మర్యాదలతో ఆయనకు వేదపండితులు స్వాగతం పలికారు. పుష్కరిణికి ప్రత్యేక పూజలు చేసిన శుక్లా అనంతరం శ్రీ కుక్కుటేశ్వరస్వామిని, పురుహూతికా అమ్మవారిని, రాజ రాజేశ్వరీదేవిని, దత్తాత్రేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రసాదాలను ఆయనకు ఈఓ చందక దొరబాబు అందజేశారు. సాయంత్రం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఆలయం వద్ద పండితులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శించుకుని వేదపండితులు ఆశీస్సులు తీసుకున్నారు. వారి వెంట ఆలయ సూపరింటెండెంట్ డీవీఎస్ కృష్ణారావు, న్యాయశాఖ అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement