నేడు అల్లూరి జయంతి
అల్లూరి స్మారక చిహ్నాల అభివృద్ధికి
రూ.2 కోట్లిస్తామని అయ్యన్న హామీ కేటాయింపు రూ. లక్షల్లో
అభివృద్ధి ప్రచారానికే పరిమితం
నేడు అల్లూరి పార్కులో వేడుకలు
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాల అభివృద్ధికి నేతల హామీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. టీడీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు పలు సందర్భాల్లో ఇచ్చిన హామీల పరిస్థితి అదేవిధంగా ఉంది. వీటిలో కొన్ని మాత్రమే అమలుకు నోచుకోగా అత్యధికం ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. రూ. 2 కోట్లు కేటాయించామని చెబుతున్న నేతలు వాటిని ఎందుకు ఖర్చు చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది.
గొలుగొండ: కేడీపేట అల్లూరి పార్కు అభివృద్ధి పనులు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. గతేడాది పర్యాటకశాఖ నుంచి పార్కు అభివృద్ధికి రూ.20 లక్షల వరకు మంజూరు అయ్యాయి. వాటితోనే విద్యుత్ దీపాలంకరణ, పర్యాటకుల విశ్రాంతికోసం చిన్న కాటేజీలు, రెస్టారెంట్, గ్రంథాలయ భవనం ఏర్పాటయ్యాయి. అంతకుమించి చేపట్టిన పనులేమీ లేవని పర్యాటకులు విమర్శిస్తున్నారు.
మంత్రి అయ్యన్నపాత్రుడు పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలు. వీటిని జులై నాలుగులోగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అల్లూరి పార్కులో సుమారు 12 అడుగుల అల్లూరి విగ్రహం ఏర్పాటు పర్యాటకులకోసం మ్యూజియం కేడీపేట అల్లూరి పార్కు నుంచి గాది గూం జలపాతం మీదుగా లంబసింగి వరకు పర్యాటకంగా అభివృద్ధి పర్యాటకులకు పూర్తిగా తాగునీరు సౌకర్యం పర్యాటకులకోసం రెస్టారెంట్పార్కు పూర్తిస్థాయిలో అభివృద్ధి (పచ్చదనం) జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం
ఇప్పటివరకు చేపట్టిన పనులుపార్కులో ఎండ ప్రభావానికి చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటడంపాత భవనాలకు సున్న, పెయింటింగ్పార్కు చుట్టూ పెరిగిన తుప్పల తొలగింపుపార్కులో శానిటేషన్ మెరుగు ఠపాడైన లైట్లకు మరమ్మతులు తాగునీరు అందేలా పైపులైన్లకు మరమ్మతులు ఇలా చిన్న పనులు మినహా ప్రధాన హామీలు అమలుకు నోచుకోలేదు. రెండేళ్లుగా అయ్యన్న ఇస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. ఈ నేపథ్యంలో అల్లూరి పార్కులో సోమవారం నిర్వహించే వేడుకల్లో పాల్గొనే ఆయన ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
ప్రధాన కేంద్రాల్లో అల్లూరి విగ్రహాలు ఏర్పాటు చేయాలిఆదివాసీ గిరిజన ఐక్యవేదిక ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి గడుతూరు రాంగోపాల్ డిమాండ్ డుంబ్రిగుడ: అల్లూరి జయంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని ఆదివాసీ ఐక్యవేదిక ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి గడుతూరు రాంగోపాల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని విశాఖపట్నం, పాడేరు కేంద్రాల్లో అల్లూరి విగ్రహాలతోపాటు అనుచరులు గంటందొర, బోనంగి పండుపడాల్, మల్లుదొర్ర విగ్రహాలను ఏర్పాటుచేయాలని కోరారు. దీనిపై గతంలో కలెక్టర్ యువరాజ్, వుడా వీసీ బాబూరావునాయుడుకు వినతిపత్రాలు అందజేశామని గుర్తుచేశారు. ఇప్పటికైనా వారు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
అంతన్నారింతన్నారు..!
Published Mon, Jul 4 2016 8:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఒక్కడి కోసం ఫ్యామిలీ మొత్తం దిగింది
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- T20 WC: సచినే ఓపెనర్గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?
What’s your opinion
Advertisement