* విద్యార్థి గల్లంతు
* నాగార్జున సాగర్ కుడికాలువలో గాలింపు
బొల్లాపల్లి: నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతైన సంఘటన మండలంలోని వెల్లటూరు గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూసారపు కోటేశ్వరావు, వెంకటమ్మ దంపతుల రెండో కుమారుడు శంకర్ గౌడ్ (11) స్నేహితులతో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. మృతుడు శ్రీ విద్యానికేతన్ ప్రవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం పాఠశాలకు సెలవు దినం కావడంతో నలుగురు స్నేహితులతో కలిసి గ్రామానికి సమీపంలోని నాగార్జున సాగర్ కుడికాలువకు సరదాగా ఈతకు వెళ్లాడు. ఈత కోడుతూ గల్లంతైనట్లు తోటి స్నేహితులు గుర్తించి కుడికాలువ పైన ఉన్న అదే గ్రామానికి చెందిన వారికి, కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. అందరూ గాలించినా ఫలితం లేదు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని బండ్లమోటు ఎస్ఐ ఎం.పట్టాభిరామయ్య తెలిపారు.