చంద్రబాబు, లోకేష్ అవినీతిలో రీసెర్చ్ చేశారు | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, లోకేష్ అవినీతిలో రీసెర్చ్ చేశారు

Published Tue, Jun 14 2016 4:21 PM

ambati rambabu takes on chandra babu

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ అవినీతిలో రీసెర్చ్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. మంగళవారం విజయవాడలో జరిగిన వైఎస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు.

చంద్రబాబు, లోకేష్ కొత్త కొత్త అవినీతి పద్ధతులను కనిపెట్టారని అంబటి రాంబాబు అన్నారు. ఇసుక, మట్టి, దేవుడి భూములు దేన్నీ వదలడం లేదని, చివరకు రేషన్ గోనె సంచులతోనూ అవినీతికి పాల్పడుతున్నారని, రెండేళ్ల పాలనలో చంద్రబాబు లక్షా 30 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ల అవినీతి గురించి వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ప్రజలకు వివరించాలని కోరారు.

Advertisement
Advertisement