స్పీకర్‌ కోడెలపై ఈసీకి ఫిర్యాదు: అంబటి | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ కోడెలపై ఈసీకి ఫిర్యాదు: అంబటి

Published Tue, Jun 28 2016 2:07 PM

Ambati To File A Complaint Against Kodela To The EC

హైదరాబాద్‌ : ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుపెట్టినట్లు ఓ చానల్‌లో స్పీకర్‌ కోడెల శివ ప్రసాదరావు ప్రకటించిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆయనపై అనర్హత వేటు వేయాలని వైఎస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో  అంబటి బృందం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన ఎన్నికల కమీషనర్‌ భన్వర్‌లాల్‌ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఖర్చు చేసిన స్పీకర్‌ కోడెలపై సుమోటోగా చర్యలు తీసుకుని ఆయన్ను అనర్హునిగా ప్రకటించాలని అంబటి కోరనున్నారు.

Advertisement
Advertisement