వినోదాత్మక చిత్రాలకు ఆదరణ | Sakshi
Sakshi News home page

వినోదాత్మక చిత్రాలకు ఆదరణ

Published Sun, Jun 18 2017 12:23 AM

ami tumi movie team visit

కాకినాడ కల్చరల్‌ : 
వినోదాత్మక చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ మెండుగా ఉంటుందని సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. స్థానిక పద్మప్రియ థియేటర్‌ను గ్రీన్‌ ట్రీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మించిన ‘అమీతుమీ’ చిత్ర బృందం శనివారం సాయంత్రం సందడి చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హిరోలు వెన్నెల కిషోర్‌,  అడవి శేషు, హిరోయిన్‌ అదితి మైకెల్‌, నటి కూమారి శ్యామల మాట్లాడుతూ ఈ చిత్రాన్ని పూర్తి వినోదాత్మక నిర్మించామన్నారు. చిత్ర దర్శకులు ఇంద్రగంటి మోహాన్‌ కృష్ణ మాట్లాడుతూ అన్ని హంగులతో చిత్ర నిర్మించడంతో హిట్‌ అయిందన్నారు. ముందుగా థియేటర్‌ మేనేజర్‌ నానాజీ చిత్ర బృందానికి çపుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.గీతా చిన్ని, గీతా ప్రోడక్షన్స్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement