ఆమిదాలగొంది విద్యార్థికి జాతీయ అవార్డు | Sakshi
Sakshi News home page

ఆమిదాలగొంది విద్యార్థికి జాతీయ అవార్డు

Published Wed, Jan 25 2017 11:06 PM

amidalagondi student elect to national award

మడకశిర రూరల్‌ : మడకశిర మండలం ఆమిదాలగొంది ఉన్నత పాఠశాలకు చెందిన గజేంద్ర అనే విద్యార్థి జాతీయ స్థాయి అవార్డును అందుకున్నాడు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో రాగా, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించాడు. ఢిల్లీలో ఎన్నికల విభాగం సీఈఓ వీలియం ఆర్‌ స్వీనీ నుంచి బుధవారం అవార్డు అందుకున్నాడు. అతన్ని ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement