రాష్ట్ర అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం | Sakshi
Sakshi News home page

రాష్ట్ర అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

Published Sat, Dec 24 2016 12:58 AM

An invitation to the awards applications

  •  26లోగా దరఖాస్తు చేసుకోవాలి
  • అనంతపురం ఎడ్యుకేషన్‌ :

    సావిత్రిభాయి పూలే జయంతిని పురస్కరించుకుని జనవరి 3న పంపిణీ చేసే రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా అవార్డులకు అర్హులైన మహిళా టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్ట్‌ అధికారి దశరథరామయ్య ఓ ప్రకటనలో తెలిపారు.   ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, సోషల్‌ వెల్ఫేర్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూళ్లలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, డైట్‌ కళాశాల అధ్యాపకులు, పీఈడీలు,  కేజీబీవీ ఎస్‌ఓలు, సీఆర్టీలు అర్హులని  పేర్కొన్నారు. టీచర్లు, హెచ్‌ఎంలు మండలస్థాయిలో దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. డివిజనల్‌ లెవల్‌ కమిటీలు సిఫార్సు చేసిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వాటిని రాష్ట్ర కమిటీకి సిఫార్సు చేస్తారు.   ఈ కమిటీ పరిశీలించి రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక  చేస్తారు. కాగా కేజీబీవీ ఎస్‌ఓలు, సీఆర్టీల దరఖాస్తులు నేరుగా ఎస్‌ఎస్‌ఏ కార్యాలయంలో అందేయాల్సి ఉంటుంది. వారి దరఖాస్తులను నేరుగా జిల్లా కమిటీ స్క్రూట్నీ చేస్తుంది.

     

Advertisement
Advertisement