అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్, ఆర్డీటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న అండర్–16 అనంత ప్రీమియర్ లీగ్ క్రికెట్ క్రీడా పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఆదివారం ఆర్డీటీతో పాటు జిల్లాలోని పలు క్రీడా మైదానాల్లో ఈ పోటీలు జరిగాయి. ఆర్డీటీ బీ మైదానంలో జరిగిన మ్యాచ్లో గుంతకల్లు, తాడిపత్రి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన గుంతకల్లు 185 పరుగులు చేసింది. జట్టులో సూరి 31, సాయి 27 పరుగులు చేశారు. తాడిపత్రి జట్టులో వినయ్ 4, దీక్షత్ 2 వికెట్లు తీశారు. అనంతరం బరిలోకి దిగిన తాడిపత్రి జట్టు 27 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. గుంతకల్లు జట్టులోని సాహుల్, సాయిలు చెరీ 4 వికెట్లు పడగోట్టి జట్టు విజయానికి దోహదపడ్డారు.
విన్సెంట్ మైదానంలో విశ్వనాథన్ ఆనంద్, బీకేఎస్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విశ్వనాథన్ ఆనంద్ జట్టు 48 ఓవర్లలో 239 పరుగులు చేసింది. జట్టులో భరత్ 81, పవన్ కళ్యాణ్ 71, వీరేంద్ర 31 పరుగులు సాధించారు. బీకేఎస్ బౌలర్లలో రమేష్ 4, హరి 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన బీకేఎస్ జట్టు 40 ఓవర్లలో 179 పరుగులు చేసి ఆలౌటైంది. జట్టులో రమేష్ 56 పరుగులు చేశారు. ఆత్మకూరు స్కూల్ మైదానంలో జరిగిన ఆత్మకూరు, కళ్యాణదుర్గం జట్లు పోటీపడ్డాయి. మొదట బ్యాటింగ్కు దిగిన ఆత్మకూరు జట్టు 37.4 ఓవర్లలో 158 పరుగులు చేసి ఆలౌటైంది. జట్టులో దిలీప్ 59 పరుగులు సాధించాడు. కళ్యాణదుర్గం జట్టులో ప్రశాంత్ 3 వికెట్లు తీశాడు. అనంతరం కళ్యాణదుర్గం జట్టు 30.2 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. ఆత్మకూరు జట్టులో అనిల్ 5, దిలీప్ 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి కీలకంగా మారారు.
మరోమ్యాచ్లో పెనుకొండ, హిందూపురం జట్లు తలపడగా హిందూపురం జట్టు మొదట బ్యాటింగ్ చేసి 142 పరుగులు చేసింది. అనంతరం పెనుకొండ జట్టు 32.5 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. జట్టులో మంజునాథ్ 49, ముదస్సిర్ 41 పరుగులు చేశారు. ఇంకో మ్యాచ్లో కణేకల్, రాయదుర్గం జట్లు తలపడగా మొదట రాయదుర్గం జట్టు 132 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన కణేకల్ జట్టు 133 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులో హరిలాల్ నాయక్ 31 పరుగులు సాధించాడు. వచ్చే ఆదివారం కూడా మ్యాచ్లు కొనసాగుతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి ప్రసన్న తెలిపారు.
రసవత్తరంగా అనంత ప్రీమియర్ లీగ్ పోటీలు
Published Sun, Nov 20 2016 11:04 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement