ఆంధ్రా,పంజాబ్‌ మ్యాచ్‌ రసవత్తరం | Sakshi
Sakshi News home page

ఆంధ్రా,పంజాబ్‌ మ్యాచ్‌ రసవత్తరం

Published Wed, Oct 12 2016 11:53 PM

ఆంధ్రా,పంజాబ్‌ మ్యాచ్‌ రసవత్తరం - Sakshi

కడప స్పోర్ట్స్‌ :
కడప నగరంలోని వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ మైదానంలో నిర్వహిస్తున్న కల్నల్‌ సీకే నాయుడు అండర్‌–23 పోటీల్లో ఆంధ్రా–పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. పంజాబ్‌ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 165.4 ఓవర్లలో 501 పరుగులు చేసింది. జట్టులోని మల్హోత్రా 82, ఆర్పిత్‌పన్ను 66 పరుగులు, కరణ్‌ 43 పరుగులు చేశారు. ఆంధ్రా బౌలర్లు మనీష్‌ 3 వికెట్లు, భీమారావు 2 వికెట్లు, వేణు 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా జట్టు బుధవారం ఆటముగిసే సయమానికి 104 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. జట్టులోని బ్యాట్స్‌మన్‌ నరేన్‌రెడ్డి 84 పరుగులు చేయగా, హర్షనాయుడు 53 పరుగులు చేశారు. ప్రణీత్‌ 78 పరుగులు, శశికాంత్‌ 27 పరుగులతో అజేయంగా క్రీజులో నిలిచారు. కాగా పంజాబ్‌ బౌలర్లు సుఖ్వీందర్‌సింగ్, ఆర్పిత్‌పన్ను చెరో రెండేసి వికెట్లు తీశారు.

Advertisement
Advertisement