సజావుగా ఏపీసెట్‌ | Sakshi
Sakshi News home page

సజావుగా ఏపీసెట్‌

Published Sun, Jul 30 2017 9:28 PM

ap cet exam completes

ఎస్కేయూ:  ఏపీసెట్‌ (ఆంధ్రప్రదేశ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)–2017 ఆదివారం అనంతపురం నగరంలోని 13 కేంద్రాల్లో సజావుగా నిర్వహించినట్లు రీజనల్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ ఎ.మల్లికార్జునరెడ్డి అన్నారు. మొత్తం 7,934 మంది అభ్యర్థులకు గాను 5,900 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. కాగా ఎస్కేయూ క్యాంపస్‌ కళాశాల, ఎస్వీ డిగ్రీ కళాశాల, ఎస్‌ఎస్‌బీఎన్‌ , అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాల, ఎస్కేయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను ఎస్కేయూ రెక్టార్‌ ప్రొఫెసర్‌ హెచ్‌.లజిపతిరాయ్, దూరవిద్య డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీవీ రాఘవులు, సెట్‌ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ఎ.మల్లిఖార్జునరెడ్డి తదితరులు పరిశీలించారు.

Advertisement
Advertisement