మంత్రుల మధ్య మళ్లీ విభేదాలు.. | Sakshi
Sakshi News home page

మంత్రుల మధ్య మళ్లీ విభేదాలు..

Published Fri, Dec 25 2015 1:01 PM

మంత్రుల మధ్య మళ్లీ విభేదాలు.. - Sakshi

అనంతపురం: అనంతపురం జిల్లాలో మరోసారి  మంత్రుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రన్న క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసే బ్యాగ్పై తన ఫోటో లేదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సహచర మంత్రి పరిటాల సునీతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి  అయినా తన ఫోటో వేయించకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదనతో ఉన్నారు.

పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రొటోకాల్ పాటించలేదని..దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఇదే విధంగా ఇరువురి మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే. రంజాన్ తోఫా పోస్టర్, బ్యాగ్లపై కూడా పల్లె ఫోటో వేయించకపోవడంతో అప్పట్లో ప్రొటోకాల్ వివాదం చెలరేగింది.

దీనిపై మంత్రి పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు.  పల్లె రఘునాథరెడ్డి అభ్యంతరాలు పట్టించుకోవాల్సిన అవసరంలేదని కొట్టి పారేశారు. క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసే బ్యాగ్లు, సంక్రాంతి చందన్న బ్యాగ్లు ఒక్కటే కావడంతో ఈ వివాదం మరింత తీవ్రమయ్యే  అవకాశమున్నట్లు తెలుస్తుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement