అర్చకులకు మంచి రోజులు | Sakshi
Sakshi News home page

అర్చకులకు మంచి రోజులు

Published Sun, Nov 6 2016 12:29 AM

archakulaku good days

బోగాపురం (పెదవేగి రూరల్‌): దేవాదాయ శాఖ ఆలయాల్లో అర్చకులకు మంచి రోజులు వచ్చాయని అర్చక సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవీకే బట్టర్‌ అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆలయ పరి«ధి భూమికి సంబంధిత అర్చకుల పేరునే పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వడానికి దేవాదాయ శాఖ కమిషనర్‌ వై.అనురాధ, జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఆదేశాలు జారీ చేయడం శుభపరిణామమని అన్నారు. భూమి హక్కు కోసం తహసీల్దార్లకు దరఖాస్తు చేసుకోవాలని,  జిల్లాలో సుమారు 250 ఆలయాలకు భూములు ఉన్నాయని వివరిం చారు. 60 ఏళ్ల వయసుగల అర్చకులకు రూ.1000 పింఛన్‌, మరణిస్తే ఇన్సూరెన్‌స క్లెయిమ్‌ రూ.4.50 లక్షలు అందించనున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ నెంబరు 99630 19589లో సంప్రదించాలని కోరారు.  
 
 
 
 
 
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement