శ్రీనగర్లో ఘటన, మృతుడు కర్నూలు జిల్లావాసి
రుద్రవరం: ఏపీకి చెందిన ఆర్మీ మెకానిక్ జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన బనగాని వెంకటకృష్ణయ్య (25) 2010లో ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం శ్రీనగర్లో (13 ఆర్ఆర్ విభాగం) విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం రాత్రి 10 గంటలకు కుటుంబసభ్యులతో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్నాడు. గురువారం ఉదయం 10 గంటలకు మళ్లీ ఫోన్ వచ్చింది. ఆర్మీ అధికారిగా చెప్పుకున్న వ్యక్తి కృష్ణయ్య ఫోన్ నుంచే మాట్లాడుతూ అతను మరణించినట్లు చెప్పాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రిలో చేర్పించగా చనిపోయినట్లు పేర్కొన్నాడు.
ఏ జరిగిందో చెప్పాలని గట్టిగా అడగడంతో.. ఒకసారి ఆత్మహత్య చేసుకున్నాడని, మరోసారి ఎదురుకాల్పుల్లో మృతి చెందాడని సమాధానాలిచ్చాడని కృష్ణయ్య బంధువులు చెప్పారు. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ కావడంతో ఏ విషయం తెలియడం లేదన్నారు. కృష్ణయ్య మరణానికి సంబంధించి తమకెలాంటి అధికారిక సమాచారం అందలేదని రుద్రవరం ఎస్ఐ హనుమంతయ్య చెప్పారు. కృష్ణయ్య చిన్నతనంలోనే తండ్రి చనిపోగా తల్లి రమాదేవి, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వీరితో పాటు తాతయ్య, నానమ్మలు అతనిపైనే ఆధారపడి ఉన్నారు. సొంత ఇల్లు కూడా లేని ఈ కుటుంబం రేకుల షెడ్లో జీవనం సాగిస్తోంది.
అసూయే హత్యకు దారితీసిందా?: ఇంటర్ చదువుతుండగానే కృష్ణయ్య ఆర్మీలో చేరేందుకు నిర్ణయించుకొని ఉద్యోగం సాధించాడు. చిన్న వయస్సులోనే ప్రమోషన్ కూడా సాధించినట్లు తెలిసింది. తనకన్నా జూనియర్ ప్రమోషన్ సాధించి తన కేడర్లో ఉండటం జీర్ణించుకోలేక ఉత్తరప్రదేశ్కు చెందిన సహచర ఉద్యోగి ఒకరు తరచూ వేధిస్తున్నట్టుగా కృష్ణయ్య చెప్పేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య జరిగిన గొడవ కృష్ణయ్య మరణానికి దారితీసి ఉండొచ్చునని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్మీ మెకానిక్ అనుమానాస్పద మృతి
Published Fri, Jul 8 2016 2:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement