Sakshi News home page

విజయనగరం లో దారుణం

Published Sun, May 22 2016 6:23 PM

Atrocity in Vizianagaram

విజయనగరం పట్టణ సమీపంలోని జమ్ముచెక్‌పోస్టు కూడలి వద్ద దారుణం చోటుచేసుకుంది. నిండు గర్భిణి అయిన భార్య కడుపుపై ఓ వ్యక్తి రాయితో బలంగా మోదాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరగడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

 

స్థానికంగా నివాసముంటున్న షేక్ బాషా భార్య జజ్మీరాతో తరచు గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ రోజు ఇద్దరు మధ్య వాగ్వాదం జరుగుతుండగా.. కోపోద్రిక్తుడైన బాషా భార్య గర్భిణి అని కూడా చూడకుండా బండరాయితో కడుపుపై కొట్టాడు. ఇది గుర్తించిన స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement