అర్జీల పరిష్కారంపై ఆడిటింగ్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంపై ఆడిటింగ్‌ ప్రారంభం

Published Wed, Apr 12 2017 12:45 AM

auditing starts on applications

అనంతపురం అర్బన్ : ప్రజలు తమ సమస్యలపై ‘మీ కోసం’, జన్మభూమి కార్యక్రమాల్లో  ఇచ్చిన అర్జీల పరిష్కారంపై ఆడిటింగ్‌ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవ¯ŒSలో జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఆడిటింగ్‌ చేపట్టారు. ‘మీ కోసం’ కార్యక్రమంలో సమస్యలపై ఇస్తున్న అర్జీలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు పదేపదే తిరుగుతున్నారనే అంశంపై సాక్షిలో ఈ నెల 4న ‘‘ఎవరి కోసం’’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కలెక్టర్‌ కోన శశిధర్‌ స్పందించారు. మీ కోసం అర్జీలపై ఆడిటింగ్‌కు ఆదేశించారు.

అనంతపురం రెవెన్యూ డివిజ¯ŒS పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించి రెవెన్యూ శాఖ ద్వారా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సమర్పించిన అర్జీల పరిస్థితిపై జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం  కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లుతో విచారణ చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ నెల రోజుల పాటు సాగుతుందన్నారు. రోజుకో డివిజ¯ŒSకి సంబంధించి అర్జీల ఆడిటింగ్‌ నిర్వహిస్తామన్నారు. సమస్య పరిష్కరించినట్లు చూపుతున్న అర్జీలపై సంబంధిత అర్జీదారునితో నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నామన్నారు. దీని తరువాత ఇతర శాఖలకు సంబంధించిన అర్జీల విచారణ ఉంటుందన్నారు. 

Advertisement
Advertisement