ఆటో బోల్తా..ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా..ఒకరి మృతి

Published Sun, Jan 3 2016 3:01 PM

auto accident, young men dead

పాలకొండ: శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం జొనగ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జొనగ గ్రామానికి చెందిన సవర కడాయి(26) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
Advertisement