Sakshi News home page

ఆటోడ్రైవర్‌ హత్య

Published Fri, Sep 30 2016 1:21 AM

ఆటోడ్రైవర్‌ హత్య

 
నెల్లూరు (క్రైమ్‌) : ఓ ఆటోడ్రైవర్‌ గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బోడిగాడితోట డాల్ఫిన్‌బార్‌ సమీపంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకుంది. బోడిగాడితోట సీసీనాయుడు నగర్‌లో అరవ శివ (24) తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. శివ జాకీర్‌ హుస్సేన్‌నగర్‌లోని ఓ వాటర్‌ ప్లాంటులో ఆటో (వాటర్‌క్యాన్ల సరఫరా చేసే)కు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. చిన్నతనం నుంచే జులాయిగా తిరిగే శివ వ్యసనాలకు పూర్తిగా బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతలో డాల్ఫిన్‌బార్‌ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు శివపై విచక్షణా రహితంగా మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో శివ తల వెనుక భాగం పగలగా, ఛాతిపై కత్తితో పొడవడంతో రక్తపు మడుగులో పడిపోయాడు. శివగాయాలతో రోడ్డుపై  పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న శివను చికిత్స నిమిత్తం డీఎస్సార్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సింహపురి హాస్పిటల్‌కు తరలించారు. చికిత్సకు అధిక ఖర్చు అవుతుందని తిరిగి డీఎస్‌ఆర్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున శివ మృతి చెందాడు. మృతుడు సోదరుడు ఆర్ముగం రెండో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ వి. సుధాకర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నార 

Advertisement

What’s your opinion

Advertisement