కాకినాడ జేఎ¯ŒSటీయూ బీటెక్ సెమిస్టర్ ప్రశ్నా పత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి వ్యాపార సమాచారం పొందుపరచటం చూస్తుంటే అది ప్రశ్నా పత్రమా, టీడీపీ కరపత్రమా అనే సందేహం కలుగుతోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ వ్యాఖ్యానించారు. ప్రశ్నాపత్రం తయారు చేసిన వీసీ, ప్రొఫెసర్లను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జేఎ¯ŒSటీయూకే యాజమాన్యం ముఖ్యమంత్రి మొప్పు పొందేందుకు ఇలా దిగజారటం విద్యార్థిలోకాన్ని అవమానపరచటమేనన్నారు. ప్రత్యేక హోదా గురించి వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుంటే సభకు అనుమతి ఇవ్వని జేఎ¯ŒSటీయూకే టీడీపీ, మిత్రపక్షం సభలకు మాత్రం అత్యుత్సాహంగా అనుమతులు ఇస్తోందని విమర్శించారు.