♦ కళాశాల యాజమాన్యం
♦ మందలించడంతో మనస్తాపం
♦ జెట్టిపాలెం గ్రామంలో విషాద ఛాయలు
మొగల్తూరు :
కళాశాల యాజమాన్యం మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఆ కుటంబంలో విషాదాన్ని నింపింది. ఏకైక కుమారుడును పోగొట్టుకున్న తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రామన్నపాలెం పంచాయతీ జెట్టిపాలెంకు చెందిన అడపా వెంకటేశ్వరరావు, శాంతమణిల ఏకైక కుమారుడు మణికంఠ. సీతారాంపురం స్వర్ణాంధ్ర కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 24న కాలేజీ యాజమాన్యం మందలించడంతో దిగాలుగా ఇంటికి చేరుకున్న మణికంఠ మనస్తాపంతో 25న ఉదయం ఇంట్లోంచి బయటకు వచ్చాడు.
అదే రోజు కుటుంబ సభ్యులు, బంధువులు మొగల్తూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి మణికంఠ ఆచూకీ కోసం వెతకడం మొదలు పెట్టారు. పోలీసులు నరసాపురం రైల్వేస్టేషన్లో సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించగా విజయవాడ వైపు వెళ్లే రైలు ఎక్కినట్టు తెలిసింది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో గాలింపు చేపట్టారు. అయితే తెనాలి రైల్వే ట్రాక్పై ఓ యువకుని మృతదేహం పడి ఉందని, మార్చురీలో భద్రపర్చారని ఈ నెల 29న సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఆక్కడ రైల్వే పోలీసులను సంప్రదించారు.
25వ తేదీ సాయంత్రం రైలుకు ఎదురెళ్లి ఆత్యహత్యకు పాల్పడ్డాడని, శవాన్ని మార్చురిలో భద్రపర్చామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకుంది మణికంఠ అని కుటుంబ సభ్యులు గుర్తించి మృతదేహాన్ని జెట్టిపాలెంకు తీసుకువచ్చారు. మణికంఠ మృతితో జెట్టిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రైలుకు ఎదురెళ్లి విద్యార్థి ఆత్మహత్య
Published Thu, Aug 31 2017 11:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు
అందుకే రాహుల్ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్
అప్పుడు అజిత్ లేడు.. అందుకే విరామం: రోహిత్ క్లారిటీ
కన్నబిడ్డపై తండ్రి కర్కశం, ప్రాణం పోయే దాకా : తల్లడిల్లిన తల్లి
అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!
ఈసీ మా ఫిర్యాదుల్ని పట్టించుకోవట్లేదు: కేటీఆర్
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
తప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
Advertisement