♦ రైతు భరోసా యాత్రలో కేసీఆర్ కుటుంబంపై భట్టి ధ్వజం
♦ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లవాడలో నేతల పర్యటన
చేవెళ్ల: రైతు ఆత్మహత్యలతో రాష్ట్రంలో చావుడప్పులు మోగుతుంటే.. సీఎం కేసీఆర్ కుటుం బం మాత్రం బతుకమ్మల పేరుతో సంబరాలు చేసుకుంటోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ‘రైతు భరోసా యాత్ర’లో భాగంగా బుధవారం కాం గ్రెస్ పార్టీ రాష్ర్ట నాయకులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లవాడలో పర్యటించారు. అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బోనగిరి యాదయ్య కుటుంబాన్ని పరామర్శిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని కేసీఆర్కు అప్పగిస్తే రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వానికి చేతులు రావడం లేదని విమర్శించారు.
రైతులు నిలువునా ప్రాణాలు తీసుకుంటుంటే ఏమాత్రం చలించట్లేదని దుయ్యబట్టారు. రైతు సమస్యలపై శాసనసభలో గొంతెత్తితే ప్రభుత్వం నియంతృత్వంగా విపక్షాలను బయటకు గెంటేసిందన్నారు. మానవత్వంలేని పాలకులు సమాజహితానికి మంచిదికాదని, పశువులకు ఉండే మానవత్వం రాష్ట్రాన్ని పాలించే హక్కు కేసీఆర్కు లేదని ఘాటుగా విమర్శించారు. రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని భట్టి హామీ ఇచ్చారు.
ప్రభుత్వానికి శుక్రవారం వరకు గడువిస్తున్నామని.. ఏకకాలంలో రుణమాఫీ చేయకుంటే శనివారం నిర్వహించే బంద్తో ప్రభుత్వానికి పట్టిన దెయ్యా న్ని వదిలిస్తామని భట్టి హెచ్చరించారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి మూడు గంటలకో రైతు మరణిస్తున్నాడని...టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలంలో 1,500 మంది రైతులు కన్నుమూశారన్నారు. మాజీ మంత్రి పి.సబితారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దొరలా అహంకారపూరిత పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
జిల్లాకు గోదావరి జలాలను తెచ్చేం దుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా కేసీఆర్ డిజైన్ మార్చి జిల్లాకు అన్యాయం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ శానససభపక్ష ఉపనేతలు జె.గీతారెడ్డి, జీవన్రెడ్డి, మాజీమంత్రులు డీకే అరుణ, ప్రసాద్ కుమార్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ రంగారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి పి. కార్తీక్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, ఎమ్మెల్యేలు వంశీ చందర్రెడ్డి, సంపత్కుమార్, సి.రామ్మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు.
రైతులు మరణిస్తుంటే బతుకమ్మ సంబరాలా?
Published Thu, Oct 8 2015 3:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement