బేస్‌బాల్‌ రాష్ట్ర జట్టుకు భూలక్ష్మి ఎంపిక | Sakshi
Sakshi News home page

బేస్‌బాల్‌ రాష్ట్ర జట్టుకు భూలక్ష్మి ఎంపిక

Published Mon, Aug 15 2016 9:10 PM

Bhoolakhsmi got selected in Base ball state team

అమరావతి : సబ్‌ జూనియర్స్‌ బేస్‌బాల్‌ రాష్ట్ర జట్టుకు అమరావతి శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్‌కు చెందిన టెన్త్‌ విద్యార్థిని కె. భూలక్ష్మి ఎంపికైనట్లు హెచ్‌ఎం కొల్లి లక్ష్మీనారాయణ సోమవారం విలేకరులకు తెలిపారు. ఈనెల 13, 14 తేదీల్లో ఏలూరు సమీపంలోని పెదపాలెంలో జరిగిన రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొన్న భూలక్ష్మి ప్రతిభ చూపి రాష్ట్ర జట్టుకు ఎంపికైందని చెప్పారు. సెప్టెంబరు12న కేరళలోని త్రివేండ్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుదని తెలిపారు. విద్యార్థినిని వ్యాయామ ఉపాధ్యాయురాలు అనురాధ తదితరులు అభినందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement