ప్రభుత్వానివి మాటలే.. చేతల్లేవ్.. | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానివి మాటలే.. చేతల్లేవ్..

Published Sat, Nov 5 2016 1:00 AM

ప్రభుత్వానివి మాటలే.. చేతల్లేవ్.. - Sakshi

కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా

ఇందూరు : రాష్ట్ర  ప్రభుత్వం ప్రజలపై అనుసరిస్తున్న తీరుకు నిరసనగా శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వో పద్మాకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు పూర్తయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదన్నారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల పథకం ఒక్కరికి కూడా కట్టి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.

ఎంతో మంది ఈ పథకం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. ఇతర పథకాల్లో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి చూపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సూర్యనారాయణగుప్తా, బాల్‌రాజు, దేవేందర్‌రెడ్డి, భరత్‌భూషణ్, మల్లేశ్‌యాదవ్, రోషన్‌బోరా, లింగం, స్వామి, నాగరాజు, గణేష్, సుగుణ, శోభ, పుష్ప తదితరులు పాల్గొన్నారు.  ఎన్డీఎస్‌ఎల్‌ను తక్షణమే పునరుద్ధరించాలి

Advertisement
Advertisement