కాలనీ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా | Sakshi
Sakshi News home page

కాలనీ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా

Published Sat, Jun 4 2016 2:11 PM

bjp workers protest at adilabad district

వాంఖిడి: ఆదిలాబాద్ జిల్లా వాంఖిడి మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీ వాసుల సమస్యలు తీర్చాలని బీజేపీ ఆధ్వర్యంలో రహదారిపై రాస్తారోకోకు దిగారు. కాలనీ ఏర్పడిన నాటి నుంచి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయలేదని, రోడ్లు వేయలేదని కాలనీవాసులు తెలిపారు. రాస్తారోకోతో హైదరాబాద్-నాగ్‌పూర్ మార్గంలో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు.

Advertisement
Advertisement