మేడ్చల్: యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించిన ఓ యువకుడు ఆమెను హోటల్కు రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఎస్ఐ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామానికి చెందిన రవూఫ్(27) నగరంలో ఎంబీఏ చదివి ఖాళీగా ఉంటున్నాడు. మేడ్చల్కు చెందిన యువతి(18) నగరంలో డిగ్రీ చదువుతోంది. ఈక్రమంలో వీరికి నగరంలోని ప్యారడైజ్ బస్టాండ్ వద్ద పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. రవూఫ్ యువతిని రకరకాలుగా ఫొటోలు తీసి వాటిని మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చాడు. తనకు లొంగకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానని తరుచూ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఈక్రమంలో ఈనెల 14న నగరంలోని ఓ హోటల్కు యువతిని రప్పించుకున్న అతడు ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని శనివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
యువతిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం
Published Sat, Jul 16 2016 10:15 PM
Related news
-
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
దేశమంతా నివ్వెరపోయిన వివాదం ఇది. ఘన కుటుంబ వారసత్వం... దేశంలోని అత్యున్నత ప్రజా ప్రాతినిధ్య వేదికైన పార్లమెంట్లో సభ్యత్వం... ఇవేవీ మనిషిలోని మకిలినీ, మృగాన్నీ మార్చలేక పోయిన విషాదం ఇది. మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడూ, ఆయన తదనంతరం కర్ణాటకలో హసన్ నుంచి పార్లమెంట్కు ఎన్నికైన యువకుడూ అయిన ప్రజ్వల్ రేవణ్ణ నిస్సహాయులైన పలువురు స్త్రీలతో సాగించిన బలవంతపు లైంగిక చర్యల వ్యవహారం సభ్యసమాజాన్ని తలదించుకొనేలా చేస్తోంది. ఏప్రిల్ 26 నాటి లోక్సభ పోలింగ్కు కొద్దిరోజుల ముందు ఆ వికృత వీడియోలు వందల కొద్దీ బయటకు రావడం సొంత కుటుంబపార్టీ జేడీ(ఎస్)ను సైతం ఆత్మరక్షణలో పడేసింది. అన్నిటికీ మించి సామాన్యులకు రక్షకులమంటూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారే చివరకు భక్షకులుగా తయారవుతున్న రాజకీయ విలువల పతనానికి ఈ వ్యవహారం మరో నగ్నసాక్ష్యంగా నిలిచింది. 2019 నుంచి 2022 మధ్య పలుమార్లు తనను ప్రజ్వల్ రేవణ్ణ లైంగికంగా బలవంతం చేశారంటూ బాధితురాలు ఒకరు ఆరోపించారు. పనివారి నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగినుల దాకా పలువురితో ఈ మాజీ ప్రధాని మనుమడు ఇంట్లో, ఆఫీసులో ఇలానే వ్యవహరించారట. వాటిని స్వయంగా రికార్డ్ చేసి, బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చారట. దాదాపు 3 వేల వీడియోలతో కూడిన ఆ వికృత చర్యల పెన్డ్రైవ్ ఇప్పుడు బయటపడింది. నిజానికి, ప్రజ్వల్ అకృత్య వీడియోల కథ కొత్తదేమీ కాదు. ఆయన వీడియోలు అనేకం కొన్నేళ్ళ క్రితమే బయటకొచ్చాయి. వాటి ప్రచురణ, ప్రసారాల్ని అడ్డుకొనేందుకు ఈ 33 ఏళ్ళ యువనేత అప్పట్లోనే కోర్టుకెళ్ళారు. మీడియా చేతులు కట్టేస్తూ హైకోర్టు నుంచి నిషేధపుటుత్తర్వులు తెచ్చుకున్నారు. తీరా ఇప్పుడు ఓ బాధితురాలు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో మరోసారి తేనె తుట్టె కదిలింది. ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొంది. ఈ మురికి చేష్టల కేసుపై ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేసింది. ప్రజ్వల్ వివాదంలో రాజకీయాలున్నాయనే మాట వినిపిస్తున్నది అందుకే!వీడియోలు అయిదేళ్ళ పాతవనీ, బాధిత మహిళలకు న్యాయం చేసే ఉద్దేశమే నిజంగా ఉంటే, ఈ పార్లమెంట్ సభ్యుడి లైంగిక దుష్ప్రవర్తనపై సాక్ష్యాలు చాలాకాలంగా ఉన్నా కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రస్తుత ఎన్నికల సమయంలోనే ఈ అస్త్రం ఎందుకు బయటకు తీసింది? ఇవీ బీజేపీ ప్రశ్నలు. బాధితురాలు కేసు పెట్టడం, వీడియోల వివాదాన్ని మీడియా బట్టబయలు చేయడంతో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నది అధికార కాంగ్రెస్ జవాబు. ఆరోపణల పర్వమెలా ఉన్నా, నిందితుడు ప్రజ్వల్ ప్రాతినిధ్యం వహిస్తున్న జెడీ(ఎస్), అలాగే దానితో పొత్తుపెట్టుకున్న బీజేపీలు నష్టనివారణ చర్యలు చేపట్టక తప్పలేదు. బీజేపీ అగ్రనేత – సాక్షాత్తూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సైతం ఈ వివాదాస్పద వీడియోలను ఖండిస్తూ, నారీశక్తినే తాము బలపరుస్తున్నామని మంగళవారం వివరణనివ్వాల్సి వచ్చింది. ప్రజ్వల్, అతని తండ్రి రేవణ్ణ విడిగా ఉంటారనీ, తమ కుటుంబంతో సంబంధం లేదనీ నిందితుడి బాబాయ్, మాజీ సీఎం కుమారస్వామి అనాల్సి వచ్చింది. ఈ సెక్స్ వీడియోల వివాదం ప్రభావం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా చూడాలనే తాపత్రయం తెలుస్తూనే ఉంది. చివరకు, ‘సిట్’ దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రజ్వల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కుమారస్వామి ప్రకటించడం అనివార్యమైంది. ప్రజ్వల్ రేవణ్ణ కేసు ఏదో నూటికో, కోటికో జరిగిన ఘటన అనుకుంటే పొరపాటే. రాజకీయ బలిమిని చూసుకొని కన్నూమిన్నూ కానని కొందరు... బలవంతపు లైంగిక చర్యలు, దాడులకు పాల్పడుతున్న కేసులు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ బడాబాబులు అధికారాన్నీ, హోదానూ అడ్డుపెట్టుకొని ఈ కేసుల నుంచి ఒంటి మీద దుస్తులు నలగకుండా బయటకు వచ్చేస్తున్నారు. మహిళా రెజ్లర్లతో లైంగికంగా అనుచిత రీతిలో వ్యవహరిస్తూ వచ్చిన బీజేపీ నేత బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కేసు అంతర్జాతీయంగానూ వార్తల్లో నిలిచినా, ఇప్పటి దాకా అతీగతీ లేదు. బాధితులకు ఇప్పటికీ న్యాయం దక్కలేదు. సందీప్ సింగ్, ఖజన్ సింగ్ లాంటి పలువురు నేతల కేసుల కథ కూడా అంతే. గమ్మత్తేమిటంటే, గతంలోనే ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్వల్ హైకోర్ట్ ‘గ్యాగ్’ ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని, దర్జాగా గడిపేశాడు. సిగ్గుమాలిన నేరచర్యలు యథేచ్ఛగా కొనసాగించాడు. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు ఇప్పుడు ప్రభుత్వం తాజాగా దర్యాప్తు చేపట్టడంతో కష్టాలు తప్పలేదు. పోలింగైన వెంటనే గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఉడాయించాడు. ప్రజ్వల్ వ్యవహారశైలి, అతని వీడియోల పెన్డ్రైవ్పై స్థానిక బీజేపీ నేత ఒకరు గత డిసెంబర్లోనే తన పార్టీని అప్రమత్తం చేశారు. జేడీ(ఎస్)తో పొత్తునూ, హసన్లో ప్రజ్వల్ అభ్యర్థిత్వాన్నీ వ్యతిరేకించారు. అన్నీ తెలిసినా బీజేపీ ముందుకెళ్ళి పొత్తు కొనసాగించడం, ప్రజ్వల్కు మద్దతుగా ఆ పార్టీ అధినాయకత్వం స్వయంగా ఎన్నికల ప్రచారం చేయడం విడ్డూరం. నారీశక్తికి వందనమంటూ కబుర్లు చెప్పి, మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు తంటాలు పడే పార్టీలు, ప్రతినిధులు ఆడ వారికి ఇస్తున్న అసలైన గౌరవం అంతంత మాత్రమే. పితృస్వామ్య భావజాలంతో స్త్రీని భోగ వస్తువుగా చూసే సంస్కృతి నుంచి ఇవాళ్టికీ మన సమాజం, నేతలు బయటపడనే లేదన్న చేదు నిజం పదే పదే రుజువవుతోంది. చివరకు తాజా లోక్సభలో మహిళా ప్రాతినిధ్యం సైతం 15 శాతం లోపలే అన్నది మన మహిళా సాధికారత మాటల్లోని డొల్లతనానికి నిదర్శనం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. అధికారం మాటేమో కానీ, ముందుగా వారిని సుఖభోగ యంత్రాలుగా భావించడం మాని, మనుషులుగా గుర్తించాలి. ప్రజ్వల్ సహా కళంకిత నేతల్ని కఠినంగా శిక్షించడం ఆ క్రమంలో తొలి అడుగు. -
రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం
ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అభ్యంతర కర తరహాలో బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కింది. దీంతో తోటి ప్రయాణీకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోపై నెటిజన్లలో విభిన్న స్పందనలు కనిపించాయి. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో బుధవారం ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ మహిళ టూపీస్ బికినీలో బస్సెక్కడం కనిపించింది. అప్పటికే అక్కడ నిలబడి ఉన్న ఓ వృద్ధురాలు పక్కకు వెళ్లిపోగా సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు సైతం లేచి వెళ్లిపోవడం గమనార్హం. దీపికా నారాయణ భరద్వాజ్ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకి దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. (ఫుడ్ ఫోటోగ్రాఫర్ అవార్డుల పోటీ : ఈ అద్భుతమైన ఫోటోలు చూశారా?) బికినీలో ఆమెను చూసి షాక్ అయ్యామని కొందరు వ్యాఖ్యానించారు. ఆమె తీరును అభ్యతరకరంగా ఉందననారు. మరికొందరు మాత్రం ఆమె బట్టలు ఆమె ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛను గట్టిగా సమర్థించారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్లోనూ ఓ మహిళ బ్రా, మినీ స్కర్ట్ తో ప్రయాణించి కలకలం రేపింది.అలాగే హోలీ సందర్భంగా ఇద్దరు అమ్మాయిలు చేసిన రీల్స్ కూడా వివాదాన్నా రేపిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతంపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది. తాజా ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు. (కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు) What's really happening 😵💫😵💫pic.twitter.com/rfjavOsWMp — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 17, 2024 -
ఇది మాయని ‘మరక’ : లైంగిక వేధింపులపై వినూత్న నిరసన
ప్రపంచవ్యాప్తంగా బాలికలు,మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జర్మనీలో మహిళా హక్కుల సంఘం వినూత్నం ప్రచారాన్ని చేపట్టింది. వేధింపులను అరికట్టేందుకు ‘అన్సైలెన్స్ ది వయలెన్స్’ అని పిలుపునిస్తూ ఓ ప్రదర్శన ఏర్పాటు చేసింది. మహిళలు, బాలికపై వేధింపుల హింస ఎన్నటికీ మాయని మచ్చ అనే అంశాన్ని విగ్రహాల రూపంలోప్రదర్శించడం విశేషం. మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ప్రదర్శన చర్చ నీయాంశంగా నిలుస్తోంది. ముగ్గురిలో ఇద్దరు స్త్రీలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటు న్నారని జర్మన్ మహిళా హక్కుల సంఘం టెర్రే డెస్ ఫెమ్మెస్ పేర్కొంది. ఈ లైంగిక వేధింపులపై చాలామంది మౌనంగా ఉంటారని, ఈ మౌనమే మరో మహిళ వేధింపులకు దారి తీస్తోందని సంస్థ ప్రతినిధి సినా టాంక్ చెప్పారు. ఇప్పటికైనా నిశ్శబ్దాన్ని బద్దలు గొట్టాలని మహిళలకు ఆమె పిలుపునిచ్చారు. “ప్రతీ నేరస్థుడు వేలమందికి కారణమవుతున్నాడు ఇకపై మహిళలపై లైంగిక వేధింపులను ఉపేక్షించవద్దు అప్రమత్తంగా ఉందాం. బాధితులకు అండగా నిలుద్దాం. కలిసికట్టుగా ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొడదాం’’ సినా టాన్ టెర్రే డెస్ ఫెమ్మెస్ బాలికలు ,మహిళలపై మానవ హక్కుల ఉల్లంఘనలు, లింగ-నిర్దిష్ట వివక్షకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం 40 సంవత్సరాలుగా పోరాడుతోంది. మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులకు సజీవ సాక్ష్యాలని హక్కుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ విగ్రహాల్లో పేర్కొన్న మాదిరిగా లైంగిక వేధింపుల మరక కూడా బాధిత మహిళను జీవితాంతం వదలదని టెర్రే డెస్ ఫెమ్మెస్ పేర్కొంది. -
చదువులతల్లి పట్ల దారుణం: చైల్డ్ లైన్ ఫిర్యాదుతో వెలుగులోకి!
అత్యాచార బాధితురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. సామూహిక అత్యాచారానికి గురైన బాలికను 12వ తరగతి పరీక్ష రాయకుండా అడ్డుకున్నారు. రాజస్థాన్లో అజ్మీర్లో ఒకప్రైవేట్ పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు చైల్డ్ హెల్ప్లైన్నంబర్కు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 12 బోర్డు పరీక్షలకు తనను హాజరుకానివ్వలేదంటూ అజ్మీర్లోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని ఆరోపించింది. గత ఏడాది సామూహిక అత్యాచారానికి గురయ్యావు కాబట్టి, పరీక్షకు హాజరైతే వాతావరణం చెడిపోతుందని పాఠశాల అధికారులు చెప్పారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. అడ్మిట్ కార్డ్ ఇవ్వ లేదని బాధితురాలు తెలిపింది. అడ్మిట్ కార్డు తీసుకోవడానికి వెళ్లినప్పుడు, అధికారులు ఇకపై పాఠశాల విద్యార్థిని కాదని తెలిపారు. అయితే దీనిపై మరో టీచర్ను సంప్రదించగా, ఆమె చైల్డ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయమని సూచించింది. అయితే బాధిత విద్యార్థిని గత నాలుగు నెలలుగా పాఠశాలకు రాకపోవడంతో ఆమెను పరీక్షకు అనుమతించడం లేదని పాఠశాల అధికారులు వాదించారు. అయితే ఆమె స్కూలుకు హాజరుకావడాన్ని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తనను లోపలికి రానీయకుండా నిషేధించారని ఇంటి నుండే చదువుకోవాలని సూచించిందని అందుకే ఇంట్లో ఉండే పరీక్షలకు ప్రిపేర్ అయినట్టు అంజలీ శర్మతో వాపోయింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు అజ్మీర్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ (సిడబ్ల్యుసి) కేసు నమోదు చేసింది, విచారణ తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అంజలి శర్మ వెల్లడించారు. శిశు సంక్షేమ శాఖ కూడా కేసు నమోదు చేసింది. 10వ తరగతి పరీక్షలలో 97 శాతం స్కోర్ సాధించిన బాధితురాలు ఇపుడు కూడామంచి మార్కులు తెచ్చుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. కానీ పాఠశాల నిర్లక్ష్యం వల్ల ఏడాది సమయం వృథా అవుతుందేమోనని భయపడుతోంది. కాగా గతేడాది అక్టోబర్లో విద్యార్థినిపై ఆమె మామ, మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.దీనిపై విచారణ నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికా విద్య, మహిళల భద్రత గురించి ఎంత మాట్లాడు తున్నా, ఎంత ప్రచారం కల్పిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదనీ, మరీ ముఖ్యంగా విద్య నేర్పే పాఠశాల్లో ఇలాంటి దారుణం ఏమిటి అనే విమర్శలకు తావిస్తోంది. -
Banjara Hills: యువతిపై లైంగిక దాడి.. ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్
హైదరాబాద్: మాట్లాడే పని ఉందని చెప్పి హోటల్కు పిలిచి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఫుడ్ డెలివరీ బాయ్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన ఒబేదుల్లాఖాన్ (23) ఫుడ్ డెలివరీ బాయ్. ఎనిమిది నెలల క్రితం లక్డీకాపూల్లో ఓ సెమినార్కు హాజరైన ప్రైవేటు ఉద్యోగిని (22) ఫుడ్ ఆర్డర్ చేయడంతో ఒబేదుల్లా ఆమెకు అందజేశాడు. ఆమె డబ్బులను గూగుల్ పే చేయడంతో ఆ నంబర్ తీసుకున్న ఒబేదుల్లా ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. కేపీహెచ్బీ కాలనీలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉండే సదరు యువతి ఒబేదుల్లాకు సన్నిహితమైంది. ఇదే అదనుగా భావించినన ఒబేదుల్లా గురువారం రాత్రి మాట్లాడే పని ఉందని ఆమెను తన బైక్పై తీసుకుని బంజారాహిల్స్లోని ఓయో రూమ్కు వచ్చాడు. రాత్రి ఒంటి గంట తర్వాత ఆమె నిద్ర మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 376, 354, 354 (ఏ), డి, 376, 66 (ఇ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
Related News by category
-
ఎన్నికలకుసై
నేడే లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్ ● ఆ వెంటనే నామినషన్ల స్వీకరణ ● 18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు ● నామినేషన్ల దాఖలుకు అభ్యర్థుల ఏర్పాట్లు సాక్షి, రంగారెడ్డిజిల్లా: సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. అధికార యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లలో తలమునకలైంది. ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై గట్టి నిఘా తదితర చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తుంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తుంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం మంచి ముహూర్తాలను అన్వేశిస్తున్నారు. ఇప్పటికే పంతుళ్లను ఆశ్రయించి, ఏ రోజు నామినేషన్ వేయాలనే అంశంపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. శుభ ముహూర్తాలు ● 18వ తేదీ గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ● 24న బుధవారం చైత్ర బహుళ పాడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే.. అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. ● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలుకు మంచి రోజు. ● 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం.. పై ముహూర్తాల కంటే ఇది యోగ్యమైనది. కానీ ఆరోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది. ● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు సైతం బయటికి వెళ్లేందుకు జంకుతున్నాయి. ఈ నేపథ్యంలో సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలు ఇలా ● అభ్యర్థులు నామినేషన్ ఫారం–2ఎను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. ● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతి. ● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదించాలి. ● అదే రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్ను ప్రతిపాదించాల్సి ఉంది. ● అభ్యర్థులు మూడు నెలల లోపు దిగిన ఒక పాస్పోర్ట్ సైజు ఫొటో అఫిడవిట్పై అతికించాలి. ● నామినేషన్ పత్రంపై స్టాంప్ సైజు ఫొటో పెట్టాలి. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన వారైతే విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ వీఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. ● రిజస్టర్/ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్–3లో సి కాలం ఎదుట ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపరచాలి. ● పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేసేందుకు అనుమతి. ● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి. నామినేషన్ల స్వీకరణ కోసం రాజేంద్రనగర్ తహహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు, భద్రత కోసం చేవెళ్లలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీని ఎంపిక చేశారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో మొత్తం 29,28,186 మంది ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. మొత్తం 2,877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణకు 13,443 పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయనున్న తేదీ బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 19 బీజేపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి 22 కాంగ్రెస్ గడ్డం రంజిత్రెడ్డి 25షెడ్యూల్ ఇలా.. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 18న నోటిఫికేషన్ ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల స్వీకరణ సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 6తో ఎన్నికల ప్రక్రియ ముగింపు -
నేనే చంపేశా..
చేవెళ్ల: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా తనకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో మేన బావను హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఊరేళ్ల సమీపంలోని ఓ ఫాంహౌస్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. చేవెళ్లకు చెందిన కడమంచి నారాయణదాస్(46) జాతీయ అంబేడ్కర్ అవార్డు గ్రహీత, రియల్ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి ఊరేళ్ల సమీపంలో ఓ ఫాంహౌస్ ఉంది. కొద్ది రోజులుగా ఇందులో మరమ్మతు పనులు చేయిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తన మేన బావమర్ది తూర్పాటి భాస్కర్తో కలిసి ఫాంహౌస్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పాడు. చీకటి పడినా రాకపోవడంతో మృతుడి భార్య పలుమార్లు ఫోన్ చేసింది. ప్రతీసారి లిఫ్ట్ చేసిన భాస్కర్.. బావ దూరంగా ఉన్నాడని చెప్పాడు. అర్ధరాత్రి తర్వాత చేవెళ్ల పీఎస్కు వెళ్లిన భాస్కర్.. నారాయణదాస్ను గొడ్డలితో నరికి చంపానని చెప్పి లొంగిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూసే వరకు నారాయణదాస్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలిజేశారు. మృతుడికి భార్య మాణెమ్మ, ఇద్దరు కుమారులున్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతోనే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే నారాయణదాస్ చాన్నాళ్లుగా భాస్కర్ను తన వెంట తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో షాబాద్ మండలం నాగరకుంటలోని ఓ భూమికి సంబంధించిన డీల్లో రూ.25లక్షలు ఇస్తానని భాస్కర్కు చెప్పాడు. ఇది పూర్తయి చాలా రోజులైనా డబ్బు ఇవ్వకుండా దాటవేస్తున్నాడు. దీంతో కొద్ది రోజులుగా భాస్కర్ అతనికి దూరంగా ఉంటున్నాడు. మంగళవారం డబ్బు అడగ్గా ఇస్తాలే నేనెక్కడికి వెళ్లట్లేదుగా అని చెప్పిన నారాయణదాస్.. భాస్కర్ను తీసుకుని ఊరెళ్లలోని ఫాంహౌస్కు వెళ్లాడు. ఇద్దరూ కలిసి అక్కడే మద్యం తాగారు. ఈ క్రమంలో డబ్బుల విషయం మరోసారి చర్చకు రావడంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ సమయంలో కింద పడిపోయిన నారాయణదాస్ లేస్తే తనను చంపేస్తాడని భావించిన భాస్కర్ అక్కడే ఉన్న గొడ్డలితో మెడపై దాడి చేశాడు. అతడు చనిపోయాడని నిర్ణయించుకుని ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు. హత్యపై అనుమానాలు నారాయణదాస్ హత్య ఒక్కడివల్ల జరగలేదని, దీనిపై నిజానిజాలు తేల్చాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరారు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అక్కడే పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. డబ్బుల విషయంలో గొడవ గొడ్డలితో దాడి చేసి మేన బావను హతమార్చిన నిందితుడు -
శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్ర మంత్రి
● సతీసమేతంగా హాజరైన కిషన్రెడ్డి ● స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ కందుకూరు: మండల పరిధిలోని తిమ్మాపూర్ రామాలయంలో బుధవారం నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములుయాదవ్, కన్వీనర్ ఎల్మటి దేవేందర్రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతిపాండు, నాయకులు అమరేందర్రెడ్డి, నిరంజన్, భిక్షపతి, పాండు, రమేష్గౌడ్ తదితరులు ఉన్నారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా విజయ్కుమార్ ఇబ్రహీంపట్నం రూరల్: భారతీయ జనతాపార్టీ యువమోర్చా జిల్లా కార్యదర్శిగా మైలారం విజయకుమార్ నియమితులయ్యారు. బీజేవైఎం రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడు యాదీష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల కేంద్రానికి చెందిన విజయ్కుమార్ బీజేపీలో చురుకై నపాత్ర పోషించారు. పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించిన అధిష్టానం కార్యదర్శిగా నియమించింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కాలుష్యకారకాలపై చర్యలు రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు మెంబర్ సత్యనారాయణరెడ్డి చేవెళ్ల: ప్రజలకు ఇబ్బంది కలిగించే కాలుష్యకారకాలపై తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బోర్డు సెక్రటరీ బుద్ధ ప్రసాద్ ఐఏఎస్ అధ్యక్షతన నగరంలో బోర్డు సభ్యుల సమావేశం నిర్వహించారని.. చేవెళ్ల ప్రాంతంలోని పలు సమస్యలను బోర్డు దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాండూరులోని ఏసియన్ బ్రౌన్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యంతో గ్రామస్తులు, విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని.. చందనవెల్లిలోని కుందన్ టైక్స్టైల్స్, శంషాబాద్ శ్రీకృష్ణ డ్రగ్స్తోనూ పర్యావరణం కాలుష్యమవుతోందని చెప్పానన్నారు. మోకిలలో నిర్మిస్తున్న విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణ వ్యర్థాలు గండిపేట చెరువులోకి వదులుతున్నారని ప్రస్తావించానన్నారు. మోకిలలోని నిర్మాణాలను సందర్శించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు బోర్డు నిర్ణయించిందని చెప్పారు. మొదటిసారి సమావేశానికి హాజరైన నూతన మెంబర్లను బోర్డు ఆధ్వర్యంలో సన్మానించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీబీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డూప్లికేట్ ఔట్ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 5,41,201 ఓట్లను అధికారులు తొలగించారు. జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 54,259 మంది డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన ఓటర్లు, చిరునామా మారిన వారు వీరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ ప్రకటించారు. మహానగరంలో ఓటర్లకు మించి ఎక్కువ ఓట్లున్నట్లు ఎంతోకాలంగా విమర్శలున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లున్నవారితోపాటు వేర్వేరు నియోజకవర్గాల్లోనూ ఓట్లుండటాన్ని రాజకీయపార్టీలు పలు సందర్భాల్లో ప్రస్తావించాయి. ఇలాంటి డూప్లికేట్ ఓటర్ల గురించి ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డూప్లికేట్ ఓటర్లను గుర్తించే చర్యలు చేపట్టిన జిల్లా ఎన్నికల యంత్రాంగం గత సంవత్సరం ఆరంభం నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు గుర్తించిన డూప్లికేట్లను తొలగించింది. -
డోర్ నంబర్లూ డొల్లే !
ఒకే కుటుంబం.. కేంద్రాలు అనేకం!సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లున్న చిత్రాలు తెలుసు. ఇది ఎలా సాధ్యం ? అంటే ఇష్టానుసారం డోర్ నంబర్లతో ఓటరు జాబితాలో పేరు చేరిపోవడం ఒక కారణం. ఒక ప్రాంతంలోని వారందరూ ఓటరుగా నమోదయ్యేటప్పుడు తమ సమీపంలోని వారు ఇచ్చిన డోర్ నంబర్తోనే తమ పేర్లు కూడా నమోదు చేసుకున్న వారున్నారు. ఒక పెద్ద భవనంలోని అద్దెదారులందరూ కూడా ఒకే డోర్నంబర్తో ఓటర్లుగా నమోదైన వారున్నారు. అంతే కాదు ఇంకొందరైతే జీహెచ్ఎంసీ కేటాయించిన ఇంటినెంబరు కాకుండా తమ ఇష్టానుసారం డోర్ నంబర్లను వేసిన వారున్నారు. ఒక ఇంటినంబరుకే అదనంగా చివరన ఎ,బి,సిలు చేర్చడమో లేక బై నంబర్లు వేయడమో చేసి ఆ ఇంటి నంబరుతోనే ఓటరుగా నమోదయ్యారు. సంబంధిత అధికార యంత్రాంగం సైతం ఆన్లైన్లోనమోదు చేసుకున్నప్పటికీ, ఆఫ్లైన్లో దరఖాస్తు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం కూడా ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన యంత్రాంగం గత రెండేళ్లుగా 2022 మార్చి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 1,81,405 మంది ఓటర్లు ఇలాంటి ఇంటినంబర్లతో ఓటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.వారిని స్టాండర్డ్ ఇంటినంబర్లలో లేనివారుగా పేర్కొంటున్నారు. అలాంటి వారిని గుర్తించి సరిచేసినట్లు పేర్కొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు. అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్ స్లిప్ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్ కేంద్రం, భార్యకు మరో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్ ఒకటే అయినా వారి పోలింగ్ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్ బూత్దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతోపాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలా ఎందుకవుతుందో అంతుపట్టలేదు. పోలింగ్ శాతం తగ్గేందుకు ఇదీ ఓ కారణంగా గుర్తించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. నగర ఓటరు జాబితాలో వింతలెన్నో రెండేళ్లుగా సరిదిద్దుతున్న యంత్రాంగం నగరంలో వింత పరిస్థితి పోలింగ్ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం -
ఓయూలో టెక్నోస్మానియా సందడి
ఉస్మానియా యూనివర్సిటీ: టెక్నాలజీ కాలేజీ విద్యార్థుల ఆధ్వర్యంలో టెక్నోస్మానియా–2024 జాతీయ స్థాయి టెక్నోకల్చరల్ ఫెస్ట్తో ఓయూ క్యాంపస్లో సందడి వాతావరణం నెలకొంది. బుధవారం వర్సిటీ ప్రవేశ ద్వారం ఎన్సీసీ గేటు వద్ద ‘నీటి చుక్కను పొదుపుగా వాడుదాం.. ప్రొటెక్ట్ ఎర్త్ ప్రిషియస్ వాటర్’ నినాదంతో ఏర్పాటు చేసిన 3కే రన్ను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.చింత సాయిలు, టెక్నోస్మానియా కన్వీనర్ ప్రొ.శ్రీనునాయక్ జెండా ఊపి ప్రారంభించారు. రేణుకా ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన జూక్ బాక్స్ మ్యూజిక్కు ఒకేసారి వందలాది మంది విద్యార్థులు సామూహిక నృతంతో అలరించారు. అనంతరం కాలేజీ ఎదుట విద్యార్థులు చేసిన బైక్ స్టంట్ చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.రమేష్కుమార్, ప్రొ.వీవీ బసవరావు, ప్రొ.రాజం, కోర్డినేటర్ డా.పరశురామ్, డా.సాదం ఐలయ్య, డా.వి భాస్కర్, డా.శ్రీనివాసులు, స్టూడెంట్స్ కోఆర్డినేటర్లు శ్యామ్ సుందర్, మాధవి, ఆకాష్, అఖిల, ముఖేష్, పాహిత్య, సూరిదుర్గ, అరవింద్ పాల్గొన్నారు.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Photos
View allVideo
View allతప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement