Sakshi News home page

ఇళ్ల మధ్య ఓపెన్‌ బ్లాస్టింగ్‌ తగదు

Published Fri, Feb 10 2017 10:15 PM

ఇళ్ల మధ్య ఓపెన్‌ బ్లాస్టింగ్‌ తగదు - Sakshi

- పారుమంచాలలో దెబ్బతిన్న గ​ృహాలను పరిశీలించిన ఎమ్మెల్యే
 - బాధితులకు   నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌
 
 పారుమంచాల(జూపాడుబంగ్లా):  నివాస గ​ృహాల మధ్య ఓపెన్‌ బ్లాస్టింగ్‌ చేయడం తగదని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు.  బ్లాసి​‍్టంగ్‌తో  ఇళ్లు దెబ్బతింటున్నాయని చెప్పారు. శుక్రవారం ఎమ్మెల్యే  గ్రామానికెళ్లి  దెబ్బతిన్న గ​ృహాలను  పరిశీలించారు. బాధిత ప్రజలతో మాటా​‍్లడి  న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. పారుమంచాల వంతెన నిర్మాణంలో భాగంగా   పునాదులను కూలీలు, యంత్రాలతో చేయిస్తే ఖర్చు ఎక్కువవుతుందని,  బ్లాస్టింగ్‌ చేయిస్తే  సహించనన్నారు. ప్రజల అనుమతులు లేకుండా ఇలా చేయడం చట్టరీత్యనేరమన్నారు. బ్లాస్టింగ్‌తో ఇప్పటికే చాలా ఇళు​‍్ల దెబ్బతిన్నాయని, వాటికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం  వంతెన నిర్మాణం పనులను పరిశీలించారు.  వంతెన పనులు దక్కించుకున్న కాంట్రాక్టరే, ఈ పనులు చేపట్టాలని, సబ్‌కాంట్రాక్టర్‌ను తొలగించాలన్నారు.  అలాగే   వంతెన నిర్మాణాన్ని నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.   కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ విజయ్‌కుమార్, చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement