చేగూరులో పోచమ్మ బోనాలు | Sakshi
Sakshi News home page

చేగూరులో పోచమ్మ బోనాలు

Published Sun, Jul 24 2016 8:02 PM

Bonalu In Cheguru

చేగూరు(కొత్తూరు) : మండల పరిధిలోని చేగూరులో ఆదివారం పోచమ్మ, మైసమ్మ, ఈదమ్మ బోనాలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు బోనాలను ఊరేగించి అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివశంకర్‌గౌడ్, సర్పంచ్‌ పాండయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ విఠల్, నాయకులు భాస్కర్, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 
 
అప్పారెడ్డిగూడలో.. 
   మండలంలోని వీర్లపల్లి, అప్పారెడ్డిగూడ గ్రామాల్లో ఆదివారం బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సుధాసుధాకర్‌గౌడ్, నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement