Sakshi News home page

గ్రంథాలయానికి పుస్తకాల బహూకరణ

Published Tue, Sep 6 2016 10:19 PM

గ్రంథాలయానికి పుస్తకాల బహూకరణ

హుజూర్‌నగర్‌: పోటీపరీక్షలకు చెందిన రూ. 5 వేల విలువైన పుస్తకాలను పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్య మహిళలు మంగళవారం శాఖా గ్రంథాలయానికి బహూకరించారు. ఈç Üందర్భంగా శాఖా గ్రంథాలయ చైర్మన్‌ కుంట సైదులు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడే పుస్తకాలను అందజేయడం అభినందనీయమన్నారు. అనంతరం దాతలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో దాతలు పొట్టుముత్తు సోమలక్ష్మి, తమ్మన సుజాత, కొత్త కళావతి, వంకాయల పద్మావతి, గ్రంథాలయాధికారి వీరస్వామి, ఊరె వెంకయ్య, సైదానాయక్, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
 
 

Advertisement

What’s your opinion

Advertisement