జిల్లాలో పిట్టల్లా రాలుతున్న ప్రజలు
డెంగీతో ఒక చిన్నారి, మలేరియాతో మహిళ మృతి
అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ
జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నా.. వైద్య శాఖ అధికారుల్లో చలనం కనిపించడం లేదు. విష జ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలుతున్నా చర్యలు కనిపించడం లేదు. తాజాగా డెంగీతో బాధపడుతూ ఒక చిన్నారి, ఓ మహిళ మృతి చెందారు.
ప్రొద్దుటూరు టౌన్: జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. ఏ ఆస్పత్రి చూసినా జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా ఉన్నా.. అధికారుల్లో చలనం కనిపించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. తాజాగా నాగేంద్రనగర్కు చెందిన 8 నెలల చిన్నారి ఎన్ నిపున్రెడ్డి డెంగీ జ్వరంతో కర్నూలులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. దీంతో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో నలుగురు చిన్నారులతో పాటు పట్టణానికి చెందిన 15 మంది డెంగీతో బాధపడుతూ కర్నూలులోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజా మరణంతో ప్రొద్దుటూరు పట్టణంలో డెంగీ, విషజ్వరాలతో మృతి చెందిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది.
వారం నుంచి చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది
నాగేంద్రనగర్కు చెందిన శివమోహన్రెడ్డి, అరుణ దంపతుల సంతానం నిపున్రెడ్డి(8 నెలల). బాలుడికి ఈ నెల 12న జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. రక్తకణాలు రోజు రోజుకు తగ్గి పోవడంతో కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మొదటి రోజు 90 వేలు ఉన్న రక్త కణాలు ఒక్క సారిగా 30 వేలకు పడిపోయాయి. దీంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో చికిత్స విఫలమై సోమవారం రాత్రి మృతి చెందాడు. చిన్నారి మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
గతేడాది నాగేంద్రనగర్లో ఐదుగురు మృతి
పట్టణంలో గత ఏడాది మొట్టమొదటి డెంగీ మరణం సంభవించింది నాగేంద్రనగర్లోనే. అప్పుడు అయిదుగురు ఈ ప్రాంత వాసులు డెంగీ, విషజ్వరాలతో మరణించారు. ఈ ప్రాంతంలో పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో జ్వరాలు విజృంభిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
విజృంభిస్తున్న జ్వరాలు
Published Tue, Sep 20 2016 9:35 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement