రైలు పట్టాల పక్కన బాలుడి మృతదేహం | Sakshi
Sakshi News home page

రైలు పట్టాల పక్కన బాలుడి మృతదేహం

Published Sun, Jul 30 2017 9:36 PM

boy body besides railway tracks

ధర్మవరం టౌన్: ధర్మవరం రైల్వేస్టేషన్‌లోని 3వ నంబర్‌ ప్లాట్‌ఫాంలో రైలు పట్టాల పక్కన ఓ వస్త్రంలో కప్పి ఉంచిన గుర్తు తెలియని బాలుడు (3) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రైల్వే పోలీసులు పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలుడు గులాబీ రంగు టీషర్ట్, చెడ్డీ ధరించాడు. ప్రయాణికులెవరైనా చనిపోయిన బాలుడిని పడేశారా.. లేక చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైనా తీసుకొచ్చి వేశారా..? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సిఉ ంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement