తిరుమలలో బాలుడిని వదిలేసిన ఆగంతకులు | Sakshi
Sakshi News home page

తిరుమలలో బాలుడిని వదిలేసిన ఆగంతకులు

Published Sat, May 14 2016 9:45 AM

boy in tirumala

తిరుమల :  తిరుమలలోని ఊంజల్ మండపం వద్ద శనివారం మూడేళ్ల బాలుడిని ఆగంతకులు వదిలివెళ్లారు. స్థానికులు ఈ విషయాన్ని గమనించిన వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాలుడి తల్లిదండ్రులు వస్తే వారికి అతడిని అప్పగిస్తామని లేకుంటే శిశువిహార్‌కు తరలిస్తామని పోలీసులు చెప్పారు.అయితే సదరు బాలుడు అంగవైకల్యం ఉండడంతో వదిలి వెళ్లారని స్థానికులు భావిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement