మధురపూడి : హీరో అల్లు అర్జున్ (బన్నీ), హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ ఓ చిత్రం షూటింగ్ నిమిత్తం జిల్లాకు వచ్చారు. హైదరాబాద్ నుంచి శనివారం విమానంలో వచ్చిన వారికి రాజమండ్రి విమానాశ్రయం వద్ద జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అసోషియేషన్ అధ్యక్షుడు ఏడిద శ్రీను, రాజమండ్రి చిరంజీవి యూత్ అధ్యక్షుడు కొత్తపేట రాజా, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏడిద బాబీ, డబ్బింగ్ రమేష్, తరలి వచ్చిన అనేకమంది అభిమానులు స్వాగతం పలికారు.
అనంతరం అర్జున్, రకుల్ రాజమండ్రి షెల్టాన్ హోటల్కు వెళ్లారు. వారు గోదావరి పరీవాహక ప్రాంతంలో మూడు రోజులు జరిగే షూటింగ్లో పాల్గొంటారని కొత్తపేట రాజా తెలిపారు.