బైక్‌ను ఢీకొన్న బస్సు: ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న బస్సు: ఇద్దరి మృతి

Published Thu, Oct 20 2016 9:51 PM

బైక్‌ను ఢీకొన్న బస్సు: ఇద్దరి మృతి - Sakshi

మేడికొండూరు :  బైక్‌ను, ప్రై వేటు ట్రావెల్‌ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మేడికొండూరు మండల పరిధిలోని పాలడుగు అడ్డరోడ్డు సమీపంలో గురువారం చోటు చేసుకుంది. ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన మార్పుల వెంకటేశ్వరరెడ్డి(57), తిరుమల కోటయ్య (60) మేడికొండూరు మండల పరిధిలోని పాలడుగు గ్రామంలోని విజయబ్యాంకుకు ద్విచక్ర వాహనంపై వచ్చారు. బ్యాంకులో పనులు పూర్తయిన అనంతరం తిరుగు ప్రయాణంలో పాలడుగు అడ్డరోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌ నుంచి గుంటూరు వైపు వస్తున్న ఓ ప్రై వేటు ట్రావెల్‌ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న మార్పుల వెంకటేశ్వరరెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన తిరుమల కోటయ్యను 108 వాహనంలో గుంటూరు సమగ్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరుగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి మేడికొండూరు సీఐ బాలాజీ, ఎస్‌ఐ కిషోర్‌ చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బాలాజీ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement