సంతోష్నగర్: చాక్లెట్ ఆశ పెట్టి ఐదేళ్ల బాలుడిపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. కంచన్బాగ్ పోలీసుల కథనం ప్రకారం....రాయల్ కాలనీ డైమండ్ హోటల్ సమీపంలో నివాసం ఉండే ఓ వ్యక్తి తన మేనల్లుడు (5)ను తీసుకొని మంగళవారం రాత్రి 8.30కి స్థానికంగా ఉన్న మసీదుకు వెళ్లాడు. మామ ప్రార్థన చేసేందుకు వెళ్లగా మసీద్ బయట కూర్చున్న బాలుడి వద్దకు సుమారు 25– 30 ఏళ్ల యువకుడు వచ్చాడు. చాక్లెట్లు కొని ఇస్తానని తన వెంట తీసుకెళ్లాడు.
ప్రార్థనలు ముగించుకొని 10 నిమిషాల అనంతరం మేనమామ బయటకు వచ్చి చూడగా బాలుడు కనిపించలేదు. దీంతో రాత్రి 9 గంటలకు బాలుడు కనిపించడంలేదని స్పీకర్లో అనౌన్స్ చేశారు. ఇది విన్న బాలుడు రోదిస్తూ మసీదు వద్దకు వచ్చాడు. అర్ధనగ్నంగా ఉన్న బాలుడిని ఏమైందని ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.