కారు ఢీకొని ఇద్దరు మృతి | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని ఇద్దరు మృతి

Published Fri, Aug 19 2016 10:58 PM

కారు ఢీకొని ఇద్దరు మృతి - Sakshi

పిఠాçపురం రూరల్‌ : 
పిఠాపురం – సామర్లకోట ప్రధాన రోడ్డులో శుక్రవారం స్కూటరిస్టును కారు ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సామర్లకోట విఘ్నేశ్వర థియేటర్‌ సమీపంలో నివసించే కంచెర్ల గంగాధర్‌ తిలక్‌ (58) తన కుటుంబ సభ్యులతో కారులో అన్నవరంలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి ప్రయాణమయ్యారు. జల్లూరు వద్దకు వచ్చే సరికి కారుకు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించే ప్రయత్నంలో ఎదురుగా స్కూటర్‌పై వస్తున్న గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన పసుపులేటి మాణిక్యం(50)ను  ఢీ కొట్టాడు. అంతటితో ఆగని కారు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును వేగంగా ఢీ కొనడంతో డ్రైవర్‌ పక్క సీటులో కూర్చున్న గంగాధర్‌ తిలక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మాణిక్యాన్ని కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న గంగాధర్‌ భార్య రమాదేవి, మరో ఇద్దరు చిన్నారులు స్వల్పగాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. గంగాధర్‌ తిలక్‌ బంధువు వీర వెంకట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పిఠాపురం పట్టణ ఎస్సై వి.కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
 

Advertisement
Advertisement