కారు, బైక్‌ ఢీకొని ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

కారు, బైక్‌ ఢీకొని ఒకరి మృతి

Published Fri, Aug 12 2016 10:53 PM

Car bike collide one man dead

 బ్రహ్మంగారిమఠం: మండలంలోని మల్లేపల్లె పంచాయతీలో ఉన్న శ్రీరాంనగర్‌ దగ్గర శుక్రవారం రాత్రి కారు– మోటార్‌ సైకిల్‌ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న బి.మఠం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. మల్లేపల్లెకు చెందిన ముత్తులూరు నాగప్రశాంత్‌ (20) పోరుమామిళ్లలో వెల్డింగ్‌ పని చేస్తుండే వాడు. పని నిమిత్తమై పోరుమామిళ్లకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మోటార్‌బైక్‌పై వస్తుండగా శ్రీరామ్‌నగర్‌ వద్ద మైదుకూరు నుంచి వెళ్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రశాంత్‌కు రెండు కాళ్లు విరగడమేగాకుండా నోటి నుంచి రక్తం పడింది. మరో యువకునికి కాలు విరిగింది. వీరిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. ప్రశాంత్‌ రిమ్స్‌కు తరలించేలోపే దారిలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Advertisement
Advertisement