మునగపాక: ఓ కారు యజమాని డ్రైవర్పై పెట్టుకున్న నమ్మకం ఓడింది. మూడేళ్లు ఎంతో నమ్మకంగా ఉంటూ.. చివరికి డబ్బుపై దురాశతో యజమానిని నట్టేటముంచాడు ఆ డ్రైవర్. సుమారు రూ. 12.75 లక్షలు, కారుతో యజమాని కళ్లుగప్పి పరారయ్యాడు. మునకపాక మండలం వెంకటాపురం వద్ద సోమవారం జరిగిన సంఘటన వివరాలను అనకాపల్లి డీఎస్పీ పురుషోత్తం విలేకరులకు వెల్లడించారు.
విశాఖపట్నం మధురవాడలోని రెవెన్యూ కాలనీలో నివాసం ఉంటున్న కనగాల శ్రీనివాసరావు వృత్తిరీత్యా కాంట్రాక్టర్. పలు కంపెనీల్లో పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో మునగపాక మండలం వెంకటాపురంలోని ఆర్హెచ్ఎల్ క్లాసిల్ కంపెనీలో కార్మికులకు వేతనాలు ఇచ్చేందుకు సోమవారం ఉదయం ఇంటి నుంచి కారులో బయలుదేరాడు. సమీపంలోని కార్పొరేషన్ బ్యాంక్లో రూ. 5లక్షలు విత్డ్రా చేశారు. కంచరపాలెంలో నివాసం ఉంటున్న తన స్నేహితుడు జేవీ ప్రసాద్తో కలిసి ద్వారకానగర్లోని కార్పొరేషన్ బ్యాంక్లో మరో రూ.5లక్షలు విత్డ్రా చేశాడు. తన వద్ద ఉన్న రూ.2.75లక్షలతో కలిపి మొత్తం రూ.12.75 లక్షలతో పయనమయ్యారు.
తనకు నమ్మకస్తుడైన కారు డ్రైవర్ పరిమి గాంధీతో కలిసి మధ్యాహ్నం 12.30గంటలకు కంపెనీ వద్దకు చేరుకున్నారు. కారులో డబ్బులు, ల్యాప్టాప్తోపాటు సర్వేకు సంబంధించిన సామగ్రి ఉంచి, జాగ్రత్తగా చూడమని డ్రైవర్కు చెప్పి లోపలికి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు వ చ్చి చూసేసరికి నగదుతో ఉన్న కారు కనిపించకపోవడంతో బాధితులు షాక్కు గురయ్యారు. వెంటనే తెరుకొని డ్రైవర్పై మునకపాక పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పురుషోత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన వెంట అనకాపల్లి రూరల్ సీఐప్రసాద్ ఉన్నారు.
నిందితుడిని పట్టుకుంటాం
డబ్బుతో పరారైన గాంధీని పట్టుకుంటామని డీఎస్పీ పురుషోత్తం, క్రైం డీఎస్పీ రవివర్మ తెలిపారు. నమ్మశక్యంగా ఉంటూ డబ్బు, కారుతో పరారైన వ్యక్తికోసం ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. చెక్పోస్టులతోపాటు ప్రధాన సెంటర్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
నమ్మకం ఓడింది!
Published Tue, Oct 27 2015 7:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నూతన కార్యవర్గం ఎన్నిక
ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
డెంగీతో ఒకరి మృతి
వలస కార్మికులకు అండగా..
ఆర్మూర్లో బైక్ చోరీకి యత్నం
కోనాపూర్లో అగ్ని ప్రమాదం
పొరపాట్లకు తావులేకుండా ఈవీఎంల కమిషనింగ్
చెట్టును ఢీకొని ఒకరి మృతి
విజృంభిస్తున్న ఎండలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement