లారీని ఢీకొన్న కారు | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న కారు

Published Sat, Sep 10 2016 10:23 PM

లారీని ఢీకొన్న కారు

  • ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్ర గాయాలు
  • దైవదర్శనం కోసం తిరుపతి వెళ్లి వస్తుండగా ప్రమాదం
  • మద్దిపాడు వద్ద గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌ సమీపంలో ఘటన..
  • క్షతగాత్రులది కరీంనగర్‌ జిల్లా
  • మద్దిపాడు (సంతనూతలపాడు) : దైవదర్శనం కోసం కారులో తిరుపతి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌ సమీపంలో శనివారం తెల్లవారు జామున జరిగింది. అందిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన రాజేష్‌ తన కుటుంబ సభ్యులు ఐదుగురికితో కలిసి దైవదర్శనానికి కారులో తిరుపతి వెళ్లాడు.
     
    అక్కడ దైవదర్శనం అనంతరం అదే కారులో ఐదుగురూ బయల్దేరారు. గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌ సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌కు కొద్ది దూరంలో కారు ఆపుకుని అంతా పడుకున్నారు. అక్కడ దోమలు విపరీతంగా ఉండటంతో కాస్త ముందుకు వెళ్లి పడుకుందామని మళ్లీ బయల్దేరారు. పెట్రోలు బంక్‌ సమీపంలో ముందు ఉన్న లారీని కారు ఢీకొంది.
     
    ప్రమాదంలో రాజేష్, ఆయన కుమారుడు నాలుగేళ్ల ప్రజ్వల్‌ కార్తీక్, భార్య మమత, తల్లి మల్లమ్మ, కారు నడుపుతున్న చిన్నాన్న శ్రీనివాస్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలో బీట్‌లో ఉన్న పోలీసులు స్థానికుల సహకారంతో క్షతగాడ్రులను బయటకు 108లో తొలుత రిమ్స్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
Advertisement